వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఎప్పుడు సహకరించాలో.. ఎప్పుడు ఎదిరించాలో జనసేనకు తెలుసు'

ప్రజల కోసం ప్రభుత్వానికి ఎప్పుడు సహకరించాలో.. అదే ప్రభుత్వాన్ని ఎదిరించాలో తమకు తెలుసునని పవన్ మరో ట్వీట్ ద్వారా తెలిపారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. నిన్నటి నుంచి తన ట్వీట్స్ ద్వారా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఆయన నిరసిస్తూ వస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరుపై తాజాగా పవన్ మరోసారి మండిపడ్డారు. 1997లో బీజేపీ ఒక ఓటు, రెండు రాష్ట్రాలు తీర్మానం చేసింద‌ని, అనంత‌రం అధికారంలోకి వ‌చ్చినా మ‌ళ్లీ ప్ర‌త్యేక తెలంగాణ ఊసును ఎత్త‌లేద‌న్నారు.

దాని ప‌ర్య‌వ‌సానంగా నిండు నూరేళ్లు బ‌త‌కాల్సిన 1458 మంది తెలంగాణ యువ‌కులు బ‌లిదానాలు చేశార‌ని ఆయ‌న అన్నారు. ఒక సున్నితమైన స‌మ‌స్య‌ని, అనేక కోట్ల మంది భ‌విష్య‌త్తుతో ముడిప‌డి ఉన్న స‌మస్య‌ని 17 సంవ‌త్స‌రాలు నాన్చి, 12 గంట‌ల్లో తేల్చేశార‌ని పేర్కొన్నారు. ఇదేనా మీ సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం!! మీకు నేర్పింది? అని ప్రశ్నించారు.

ఒకవేళ రేపటి శాంతియుత నిరసనకు కేంద్ర-రాష్ర ప్రభుత్వాలు అడ్డుపడితే.. తమ హక్కుల కోసం రాష్ట్ర ప్రజలంతా ఓ సుదీర్ఘ 'బ్యాటిల్ ఆఫ్ ఆంధ్రాస్' పోరాటానికి సిద్దం కావాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రజల కోసం ప్రభుత్వానికి ఎప్పుడు సహకరించాలో.. అదే ప్రభుత్వాన్ని ఎదిరించాలో తమకు తెలుసునని పవన్ మరో ట్వీట్ ద్వారా తెలిపారు.

English summary
Janasena President Pawan Kalyan responded again on special status. he said that when to cooperate and when to confront with govt for people says Pawan Kalyan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X