నేను తలుచుకుంటే: ఊగిపోయిన జేసీ దివాకర్ రెడ్డి, అసలు విషయం ఇదీ
అనంతపురం: తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లా గుత్తిలో హల్చల్ చేశారని తెలుస్తోంది. బుధవారం అనంతపురం జిల్లా మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి గుత్తిలో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి గుత్తి మున్సిపల్ చైర్ పర్సన్ తులసమ్మ తనయుడు శీనుపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. నేను తలుచుకుంటే నువ్వు, నీ అమ్మ, గుత్తి మున్సిపల్ కమిషనర్ ఉండరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, మధుసూదన్ గుప్తాతో కలిసి జేసీ దివాకర్ రెడ్డి పర్యటించడంపై గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. టీడీపీ సభ్యత్వం లేని మధుసూదన్ గుప్తాను తనకు పోటీగా తెచ్చేందుకు జేసీ దివాకర్ రెడ్డి ఇలా చేస్తున్నారని జితేంద్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. జితేంద్ర గౌడ్ అసంతృప్తితో ఉండగా ఆయనకు మద్దతుగా శీను మాట్లాడినందునే జేసీకి ఆగ్రహం వచ్చినట్లుగా చెబుతున్నారు.