చేయి నరికేశారు, చంపేస్తారు: జేసీ బ్రదర్స్పై జగన్ పార్టీ నేత హరిప్రియ సంచలనం
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత హరిప్రియ సంచలన ఆరోపణలు చేశారు.
అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత హరిప్రియ సంచలన ఆరోపణలు చేశారు.
బాబుకు పోటీ జగనే, గెలిస్తే సంతోషం: చిరు, తమ్ముడిపై జేసీ ఆసక్తికరం, 'నేనింతే'
బాబు మాకు మంత్రి పదవులివ్వరు! పోటీ చేయొద్దని.: జేసీ సంచలనం, 'జగన్ మా వాడే..'
తన అన్నను చంపిన కేసులో జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులతో రాజీ పడని కారణంగా తనపై హత్యాయత్నం చేశారని హరిప్రియ ఆరోపించారు. అప్పేచర్ల గ్రామంలో ఆమెపై జేసీ, టీడీపీ వర్గంగా అనుమానిస్తున్న దుండగులు ఆమెపై దాడికి పాల్పడ్డారు.
సోదరుడ్నీ చంపేశారు..
కాగా, తన సోదరుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ భాస్కర్ రెడ్డిని జేసీ వర్గీయులు హత్య చేశారని, ఈ కేసు విచారణ దశలో ఉందని హరిప్రియ చెప్పారు. తాను ఈ కేసులో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.
నన్ను హత్య చేసేందుకు కుట్ర
తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని, విననందుకు తనను కూడా హత్య చేసేందుకు ప్రయత్నించారని హరిప్రియ ఆరోపించారు.
జేసీ, టీడీపీ సర్కారుదే బాధ్యత
గత పది రోజులుగా నిత్యం దాడికి యత్నిస్తున్నారని, తనకు ఏదైనా జరిగితే ఆ బాధ్యత జేసీ దివాకర్ రెడ్డి, టీడీపీ ప్రభుత్వానిదేనని హరిప్రియ అన్నారు. తనపై హత్యాయత్నం పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు.
చేయి నరికేశారు
కాగా, అప్పేచర్ల గ్రామంలో జేసీ, టీడీపీ వర్గీయులుగా అనుమానిస్తున్న దుండగులు హరిప్రియపై దాడి చేశారు. ఆమె చేయిని నరికేశారు. దీంతో ఆమె తీవ్రగాయాలతో అక్కడే కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.