అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరువుకు భంగం: సోషల్ మీడియాలో జేసీ, పల్లె ఫోన్ సంభాషణ, ముగ్గురిపై కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలను రహస్యంగా రికార్డు చేసి.. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారానికి పాల్పడిన కొండసాని సురేష్‌రెడ్డి, మరో ముగ్గురిపై కొత్తచెరువు పోలీసులు కేసు నమోదు చేశారు.

అజ్ఞాతవాసులు! జగన్‌ను అవహేళన చేస్తారా?: బాబు, పవన్‌పై బొత్స తీవ్ర వ్యాఖ్యలు అజ్ఞాతవాసులు! జగన్‌ను అవహేళన చేస్తారా?: బాబు, పవన్‌పై బొత్స తీవ్ర వ్యాఖ్యలు

పరువు ప్రతిష్టకు భంగం

పరువు ప్రతిష్టకు భంగం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే, ఎంపీల ఫోన్ సంభాషన్ రికార్డుపై టీడీపీ మండల కన్వీనర్‌ దామోదర్‌ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కొండసాని సురేష్‌రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ.. రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ ఎమ్మెల్యే పరువు, ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని పిర్యాదులో పేర్కొన్నారు.

 రెచ్చగొట్టేలా..

రెచ్చగొట్టేలా..

బహిరంగ ప్రచారంలో పాల్గొంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో విబేధాలు సృష్టించి రాజకీయ లబ్దిపొందాలనే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి చర్యలతో అందరిని రెచ్చగొడుతున్నారని ఆయన తెలిపారు.

అక్రమ ఆస్తులు..

అక్రమ ఆస్తులు..

కాగా, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటూ అక్రమ సంపాదనతో ఆదాయానికి మించిన ఆస్తులను కూడగట్టుకున్నారని దామోదర్ నాయుడు తన ఫిర్యాదులో ఆరోపించారు.

సురేష్ రెడ్డిపై కేసు

సురేష్ రెడ్డిపై కేసు

దామోదర్ ఫిర్యాదు మేరకు వ్యక్తిగత సంభాషణల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి, ప్రచారం చేసిన కారణంగా సురేష్‌రెడ్డితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
Case filed on Three persons in TDP MP JC Diwakar Reddy and Palle Raghunatha Reddy's phone conversation issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X