వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికా ఈ మెయిల్ ఇష్యూ: జగన్కు జేసీ దివాకర్ రెడ్డి సూచన
అమెరికా ఈ మెయిల్స్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం నాడు స్పందించారు.
అనంతపురం: అమెరికా ఈ మెయిల్స్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం నాడు స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉండగా ఆయనకు చెడ్డపేరు వచ్చేలా కొందరు వ్యక్తులు తప్పుడు మెయిల్స్ పంపించడం సరికాదన్నారు.
మన వాళ్లు అమెరికా వెళ్లినప్పుడు మనం సహకరించాలని హితబోధ చేశారు. ఇలాంటి మెయిల్స్ ఎవరు పంపించినా తప్పేనని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో టిడిపి నేతలు జగన్నే తప్పుబడుతున్నందున... జేసీ వ్యాఖ్యలు పరోక్షంగా ఆయనకే వర్తిస్తాయి.
నన్ను కించపరిచేలా పోస్టులని అనిత: పొలిటికల్ పంచ్ రవికిరణ్ అరెస్ట్
కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అమెరికా పర్యటనలో ఈమెయిల్స్ వ్యవహారం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ విషయమై టిడిపి - వైసిపి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
Comments
jc diwakar reddy chandrababu naidu america ys jagan ysr congress irving mayor telugudesam చంద్రబాబు నాయుడు అమెరికా వైయస్సార్ కాంగ్రెస్ ఇర్వింగ్ మేయర్ తెలుగుదేశం జేసీ దివాకర్ రెడ్డి
English summary
Anantapuram MP JC Diwakar Reddy on Tuesday responded on E mails issue.
Story first published: Tuesday, May 9, 2017, 17:05 [IST]