వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌పై రామ్మోహన్ నాయుడు సంచలన ఆరోపణలు, జేసీ దివాకర్ సెటైర్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు బుధవారం విమర్శలు గుప్పించారు. ఏపీపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీడీపీ ఎంపీలు అనంతపురంలో నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పవన్‌ను ఉద్దేశించి తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

Recommended Video

మొదటికే మోసం : పవన్‌పై ఆదేశాలు జారి చేసిన టీడీపీ

ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియని కళాకారుడు అంటూ ఎద్దేవా చేశారు. అసలు ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే క్లారిటీ ఉండదన్నారు. వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్, బీజేపీలు ఏకమై చంద్రబాబు నాయుడును గద్దె దించేందుకు కుట్రలు చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటకలో ఉన్న తెలుగు వారు బీజేపీకి ఓటు వేయలేదన్నారు.

ఆ ఆలోచన తప్ప ఏదీ లేదు

ఆ ఆలోచన తప్ప ఏదీ లేదు

జీఎస్టీతో సామాన్యుడి పైన పెనుభారం మోపారాని కేంద్రంపై రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్నికల ఆలోచన తప్ప అభివృద్ధి ఆలోచన లేదని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల ఎంపీలు ఆదర్శంగా తీసుకునేలా పోరాడుతామని ఆయన అన్నారు.

దీక్షల వల్ల ఒరిగేదేమీ లేదు

దీక్షల వల్ల ఒరిగేదేమీ లేదు

అంతకుముందు, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా జనసేనానిపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ, వైసీపీ అధినేత వైయస్ జగన్ పైనా విమర్శలు గుప్పించారు. మోడీ ఉన్నంత వరకు ఏపీకి న్యాయం జరగదన్నారు. దీక్షల వల్ల ఒరిగేదేమీ లేదని, కేవలం ప్రజలకు అవగాహన కల్పించడానికే ఈ దీక్షలు అన్నారు. వెంకయ్య నాయుడు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే అంతో ఇంతో న్యాయం జరిగిందన్నారు.

 పవన్ కళ్యాణ్ పుట్టిన వెంటనే సీఎం కావాలనుకుంటున్నారు

పవన్ కళ్యాణ్ పుట్టిన వెంటనే సీఎం కావాలనుకుంటున్నారు

చంద్రబాబు నాయుడు తనకు ఏం చేయలేదని, ఆయనను పొగడాల్సిన అవసరం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తాను త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెబుతానని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన వెంటనే ముఖ్యమంత్రి అంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అయితే తల్లి గర్భం నుంచే సీఎంను అంటున్నారని విమర్శించారు.

జగన్ కల నెరవేరదు

జగన్ కల నెరవేరదు

అసలు జగన్, పవన్ కళ్యాణ్‌ల మధ్య సయోధ్య ఎలా కుదురుతుందని జేసీ ప్రశ్నించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్ చిన్నప్పటి నుంచి నాయకుడి అయ్యే వరకు ఆయన గురించి తనకు తెలుసునని చెప్పారు. పవన్ పుట్టగానే క్యార్.. క్యార్ అనకుండా సీఎం.. సీఎం అంటున్నారు. ఇద్దరూ సీఎంలు అయితే రాజీ కుదిర్చేదెవరని ప్రశ్నించారు. సీఎం కావాలన్న జగన్ కల నెరవేరదని చెప్పారు.

English summary
Telugudesam Party MPS JC Diwakar Reddy and Rammohan Naidu satires on Jana Sena chief Pawan Kalyan on Wednesday in Anantapur deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X