వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడుకు కోసం రంగంలోకి దేవేగౌడ: కేసీఆర్-చంద్రబాబు-మమతలకు ఫోన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/బెంగళూరు: కర్ణాటక రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్), కల్వకుంట్ల చంద్రశేఖర రావు (తెలంగాణ)లకు జేడీఎస్ అధినేత దేవేగౌడ ఫోన్ చేశారని తెలుస్తోంది. జేడీఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతు కోరారు.

కుమారస్వామి ఎఫెక్ట్: 2019లో దెబ్బ.. కాంగ్రెస్‌లో కొందరి భయం అదే, యడ్డీ బలం ఆ 'రెండు' కారణాలేకుమారస్వామి ఎఫెక్ట్: 2019లో దెబ్బ.. కాంగ్రెస్‌లో కొందరి భయం అదే, యడ్డీ బలం ఆ 'రెండు' కారణాలే

వారితో పాటు బీహార్ సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు ఫోన్ చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. తాను తన తండ్రిని రంగంలోకి దింపుతానని, తన తండ్రి దేవేగౌడ జోక్యం చేసుకోవాలని హెచ్‌డీ కుమారస్వామి వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌడ రంగంలోకి దిగారు.

JDS leaders phone to Chandrababu and KCR

కాగా, కర్ణాటకఎన్నికల్లో బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌తు 38 సీట్లు వచ్చాయి. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో గవర్నర్ అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. తమకు ఇతర ఎమ్మెల్యేల మద్దతు ఉందని యడ్యూరప్ప చెబుతున్నారు. కానీ ఆ ఎమ్మెల్యేలు తమ వెంటే ఉన్నారని కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు చెబుతున్నాయి. కర్ణాటక సామాజిక పరిణామాల నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. వారికి బీజేపీ గాలం వేస్తోంది.

జేడీఎస్ నేత కుమారస్వామి మాట్లాడుతూ.. కేంద్రంపై పోరాటానికి ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలన్నారు. బాబు, కేసీఆర్, నవీన్ పట్నాయక్, మమతలు ముందుకు రావాలన్నారు. కర్ణాటకలో గవర్నర్ చర్య అనైతికమన్నారు.

English summary
JDS leaders phone to Andhra Pradesh CM Chandrababu Naidu and Telangana CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X