వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యనమల వ్యాఖ్యలపై ఫైర్ అయిన జోగి రమేష్ .. కళ్ళు పోయాయా, మైండ్ బ్లాంక్ అయిందా అని ప్రశ్న

|
Google Oneindia TeluguNews

వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ప్రజలకు అంతా అర్ధం అయ్యిందని ప్రచారం పస తప్ప జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పస లేదని యనమల పేర్కొన్నారు .జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల విరుచుకుపడ్డారు. ఇక ఈ బడ్జెట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ యనమల రామకృష్ణుడుకు సవాల్ విసిరారు. ఈ నేపధ్యంలో యనమల వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు జోగి రమేష్ .

<strong>అరకు ఎమ్మెల్యే కిడారిసర్వేశ్వర్ రావు , సివేరి సోమల హత్యకేసులో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ </strong>అరకు ఎమ్మెల్యే కిడారిసర్వేశ్వర్ రావు , సివేరి సోమల హత్యకేసులో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ

 యనమల రామకృష్ణుడుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆగ్రహం... యనమలకు మైండ్ బ్లాంక్ అయ్యిందా ?

యనమల రామకృష్ణుడుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆగ్రహం... యనమలకు మైండ్ బ్లాంక్ అయ్యిందా ?

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి మాటలు వింటే నవ్వొస్తుందని విమర్శించారు. ఇక బడ్జెట్ చూసి యనమలకు మైండ్ బ్లాంక్ అయ్యిందని ఆయన ఆరోపించారు . . సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ లోనే అన్ని వర్గాల వారికి పెద్దపీట వేశారని జోగి రమేష్ కితాబిచ్చారు.

యనమలకు ఏమైనా కళ్లు పోయాయా అని ప్రశ్న వేసిన ఎమ్మెల్యే జోగి రమేష్

యనమలకు ఏమైనా కళ్లు పోయాయా అని ప్రశ్న వేసిన ఎమ్మెల్యే జోగి రమేష్

రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి జగన్ సర్కార్ పెద్ద పీట వేస్తుంటే యనమలకు ఏమైనా కళ్లు పోయాయా అంటూ ప్రశ్నించారు. జగన్‌ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తే చంద్రబాబు నాయుడు దాన్ని వెబ్‌సైట్‌ నుంచి తొలగించాడని విమర్శించారు జోగి రమేష్ . రైతు భరోసా ద్వారా రైతులకు రూ. 8750 కోట్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 3 వేల కోట్లు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానికే చెల్లుతుందని జోగి రమేష్ స్పష్టం చేశారు. సీఎం జగన్‌కు దశ ఉంది కానీ దిశ లేదని ఎద్దేవాచేశారు. 'బడ్జెట్‌లో నేనున్నాను.. నేను విన్నాను అని చెప్పే జగన్‌. నేను తిన్నాను అని కూడా చెప్పుకుంటే బాగుంటుందని ఏం ఉద్ధరించారని పథకాలకు వైఎస్ పేరు పెడుతున్నారని యనమల చేసిన వ్యాఖ్యలకు జోగి రమేష్ ప్రభుత్వ పథకాలకు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్‌ రెడ్డి పేరు పెడితే తప్పేంటని నిలదీశారు. అమ్మఒడి కార్యక్రమం ద్వారా కొన్ని లక్షల మంది తల్లుల కలలను నెరవేరుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అందుకే ఆ పథకానికి జగనన్న పేరు పెట్టామని చెప్పారు.

 త్వరలో టీడీపీ నేతలు తిన్న సొమ్ము కక్కిస్తామన్న జోగి రమేష్

త్వరలో టీడీపీ నేతలు తిన్న సొమ్ము కక్కిస్తామన్న జోగి రమేష్

అలాగే నవరత్నాల అమలుపై దృష్టి పెట్టామని ,నామినేటెడ్‌ పోస్టులో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత తమకే దక్కుతుందని జోగి రమేష్ తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎప్పుడైనా రిజర్వేషన్లు పాటించారా అంటూ మండిపడ్డారు. తొందర్లోనే 30 కమిటీలు వేసి టీడీపీ నేతలు తిన్న సొమ్ము కక్కిస్తామని ఎమ్మెల్యే జోగి రమేష్ హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశాలను 80 శాతం ప్రజలకు అందించేలా బడ్జెట్ ఉందని అయితే యనమల మాత్రం ఎన్నికల హామీలను నెరవేర్చలేదనడం హాస్యాస్పదమన్నారు రమేష్.

English summary
YSR Congress MLA Jogi Ramesh has expressed outrage over former finance minister Yanamala Ramakrishnudu, who criticized the budget introduced by the YSR Congress government in the Assembly. Former Finance Minister Yanamala Ramakrishna's comments on the Budget were laughed at. He accused the Yanamala of being a Mind Block in view of the Budget. . Jogi Ramesh said that the first budget introduced under the leadership of CM YS Jagan, all the sections of the people have been given priority .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X