వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకుల్ని మోసగించి కోట్లు సంపాదించావ్: సుజన 'చెల్లని నోటు'పై జోగి ఫైర్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ బుధవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. హోదాను చెల్లని రూ.500, రూ.1000 నోట్లతో రద్దు చేయడాన్ని ఆయన ఖండించారు.

చెల్లని రద్దైన రూ.500, రూ.1000 వంటిదే, ఊరుకోం: హోదాపై సుజన సంచలనంచెల్లని రద్దైన రూ.500, రూ.1000 వంటిదే, ఊరుకోం: హోదాపై సుజన సంచలనం

హోదా చెల్లని నోటు కాదన్నారు. ఈ విషయాన్ని సుజన తెలుసుకోవాలన్నారు. బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించిన ఘనత సుజనా చౌదరి అన్నారు. తమ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో హోదాను సాధించి తీరుతామన్నారు.

Jogi Ramesh lashes out at Sujana Choudhary

ప్రత్యేక హోదా తీసుకురావడం ప్రభుత్వానికి చేత కాలేదు కాబట్టే జగన్ పోరాటం చేస్తున్నారన్నారు. కేంద్రం, చంద్రబాబు మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. హోదా వస్తేనే పేదల కడుపులు నిండుతాయన్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలకు ప్రత్యేక హోదా కాదని, నియోజకవర్గాల పునర్ విభజన కావాలనటం సిగ్గుచేటు అన్నారు. ప్రజలకు కావాల్సింది పునర్ విభజన కాదని, ప్రత్యేక హోదానే అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వస్తే జేబులు నిండుతాయనేది టిడిపి నేతల ఆలోచన అన్నారు. సుజన తన నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు.

English summary
YSR Congress Party leader Jogi Ramesh lashes out at Union Minister Sujana Choudhary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X