వైసిపి లో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ : ఎన్నికల బరిలోకి ఎక్కడి నుండి..!
Recommended Video
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ..ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువు అయిన నార్నె శ్రీనివాస రావు వైసిపి కండువా కప్పుకున్నారు. ఆయన కొంత కాలంగా జగన్ తో టచ్ లో ఉన్నారు. శ్రీనివాస రావును జగన్ పార్టీలోకి ఆహ్వానిం చారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సైతం వైసిపి లో చేరారు. ఇక, ఇప్పుడు నార్నే శ్రీనివాస రావు ఎక్కడ నుండి ఎన్నికల బరిలోకి దిగుతారనేది ఆసక్తి కరంగా మారింది..
వైసిపి లో చేరిన నార్నే..
జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస రావు వైసిపి లో చేరారు. ఆయనను వైసిపి అధినేత జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చాలా కాలంగా జగన్ తో టచ్ లో ఉన్నారు. నార్నే శ్రీనివాస రావు..టిడిపి అధినేత చంద్ర బాబుకు బంధువు. శ్రీనివాస రావు సతీమణి చంద్రబాబు కు దగ్గరి బంధువు. వీరి వివాహం చంద్రబాబు నిశ్చయం చేయిం చారని చెబుతారు. ఇక, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి నార్నే శ్రీనివాస రావు కుమార్తె. అయితే, ప్రస్తుతం టిడిపికి జూనియర్ ఎన్టీఆర్ సైతం దూరం పాటిస్తున్నారు. 2009 ఎన్నికల్లో టిడిపి కోసం ప్రచారం చేసిన జూనియర్ ఆ సమయంలోనే ప్రమా దానికి గురయ్యారు. ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం తన సోదరి సుహాసిని కుకట్పల్లి నుం డి పోటీ చేసినా..మద్దతుగా జూనియర్ ప్రచారానికి వెళ్ల లేదు.
ఎక్కడి నుండి బరిలోకి..
ఇక, నార్నే శ్రీనివాస రావు వచ్చే ఎన్నికల్లో వైసిపి తరపున ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మా రింది. పార్టీ అధినేత ఎక్కడ నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి బరిలోకి దిగుతానని శ్రీనివాస రావు చెబుతున్నా రు. బరిలోకి దిగాలా వద్దా అనేది జగన్ నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసారు. నార్నే శ్రీనివాస రావు స్వ స్థలం గుంటూరు జిల్లా. గత ఎన్నికల సమయంలో ఆయన వైసిపి నుండి చిలకలూరి పేట సీటు ఆశించారు. ఇప్పుడు, ఆ సీటు రజని అనే బిసి మహిళ కు కేటాయించారు. దీంతో..నార్నే శ్రీనివాస రావు గుంటూరు ఎంపిగా పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఎమ్మెల్యేగా బరిలోకి దించాలని భావిస్తే.. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం అన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా ఉన్న వారే వచ్చే ఎన్నికల్లో అభ్యర్దులుగా ప్రచారం కూడా మొదలు పెట్టారు. దీంతో..ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
పార్టీలో చేరిన కిల్లి కృపారాణి..
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అధికారికంగా వైసిపి లో చేరారు. కృపారాణి పార్టీలో చేరిన వెంటనే చంద్రబాబు నాయుడు పై విమర్శలు ఎక్కు పెట్టారు. జగన్ ట్రెండ్ సెట్టర్ అంటూ..ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారని దుయ్య బట్టారు. పసుపు - కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇక, కృపారాణి టెక్కలి నుండి అసెంబ్లీకి..లేదా శ్రీకాకుళం నుండి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది. దీని పై జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని కిల్లి కృపారాణి చెబుతున్నారు.