సత్యం స్కామ్పై విచారణ పూర్తి: 26న తుది తీర్పు
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ ముగిసింది. ఈ కేసులో సత్యం రామలింగరాజుతో పాటు ఇతర నిందితులను కోర్టు దోషులుగా నిర్దారించింది. ఈ కేసులో తుది తీర్పును కోర్టు ఈనెల 26కు వాయిదా వేసింది.
కోట్లాది రూపాయల కుంభకోణం కేసు ఇది. ఈ కేసు విచారణ గత ఐదేళ్లుగా సాగుతోంది. సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పును ఈ నెల 26వ తేదీన వెల్లడించనున్నట్లు 25వ అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చెప్పారు.
తుది తీర్పును వెలువరించడానికి కోర్టు 216 మంది సాక్షులను విచారించింది. దాదాపు 3-38 పత్రాలను పరిశీలించింది. 2009 జనవరి 7వ తేదీన సత్యం కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చింది.
కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని అప్పటి సత్యం కంప్యూటర్స్ చైర్మన్ రామలింగ రాజు అంగీకరించారు. ఇది ప్రపంచ కార్పోరేట్ ప్రపంచాన్ని దిమ్మతిరిగేలా చేసింది.