Kakinada YSRCP Corporator Murder Video: కారుతో పదేపదే తొక్కించి- సీసీటీవీ ఫుటేజ్
కాకినాడలో వైసీపీ కార్పోరేటర్ కంపర రమేష్ హత్య అత్యంత పాశవికంగా జరిగినట్లు తాజాగా బయటపడిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యర్ధులు ఏదో ఆవేశంలో ఈ హత్య చేయలేదని ఈ దృశ్యాలను బట్టి తెలుస్తోంది. చిన్న తగాదా కారణంగా రమేష్ ప్రత్యర్ధులు హత్య చేశారని పోలీసులు చేస్తున్న వాదనలో కూడా నిజం లేదని ఈ దృశ్యాలను చూస్తే ఇట్టే అర్దమవుతోంది.
కాకినాడ నగరంలోని వలసపాలక సమీపంలో ఉన్న ఓ బార్లో వైసీపీ కార్పోరేటర్ మద్యం సేవిస్తున్న సమయంలో జరిగిన ఓ ఘటనలో ప్రత్యర్ధి చిన్నా, తన అనుచరులతో కలిసి కారుతో గుద్దించి ఆయన్ను చంపారని ముందుగా అంతా భావించారు. కానీ అదృష్టవశాత్తూ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఉద్ధేశపూర్వకంగా ఓ ముగ్గరు పదే పదే రమేష్పై వేగంగా కారు పోనిచ్చి ఆయన్ను హత్య చేసినట్లు సీసీటీవీ దృశ్యాలు చెప్తున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం చూస్తే వలసపాలకలో ఉన్న సూర్య కార్ వాష్లో మద్యం పార్టీ చేసుకుంటున్న రమేష్.. మధ్యలో కాకినాడ రెవెన్యూ కాలనీకి చెందిన గురజాడ చిన్నాను రమ్మని ఆహ్వానించాడు. దీంతో గురజాడ చిన్నాతో పాటు అతని సోదరుడు గురజాడ కుమార్ అక్కడికి చేరుకున్నారు. మద్యం పార్టీ చేసుకున్నాక కంపర రమేష్ను గురజాడ సోదరులు తమ ఇంట్లో పార్టీకి ఆహ్వానించారు. రమేష్ కుదరని చెప్పడంతో ఆగ్రహంతో వీరిద్దరూ కారుతో గుద్దించి చంపేశారని చెప్తున్నారు. అయితే రమేష్ హత్యకు ఇంతకు మించిన కారణాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.
భయానకంగా కాకినాడ వైసీపీ కార్పోరేటర్ హత్య- కారుతో పదేపదే తొక్కించి #YSRCP #Tdp #Kakinada pic.twitter.com/LXhkvqdV8g
— oneindiatelugu (@oneindiatelugu) February 12, 2021