కళ్లు గప్పి తిరుగుతున్న కళానికేతన్ ఎండి అరెస్టు
అనంతపురం: కళానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ వేములూరి లీలాకుమార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. లీలాకుమార్ను అరెస్టు చేసిన విషయాన్ని ధర్మవరం పట్టణ పోలీసుస్టేషన్లో డీఎస్పీ వేణు గోపాల్ తెలిపారు.
కళానికేతన్ డైరెక్టర్ నుంచి కీలక సమాచారం
కళానికేతన్ టెక్స్టైల్ సంస్థ ధర్మవరంలోని పట్టుచీరల వ్యాపారుల నుంచి రూ.4,14,71,000 విలువ చేసే పట్టు చీరలను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన డబ్బు చెల్లించక పోవడంతో వ్యాపారులు ధర్మవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
2 కోట్లు లంచం ఇవ్వజూపారు: కళానికేతన్ యాజమాన్యంపై ధర్మవరం ఎమ్మెల్యే
ధర్మవరంలో కళానికేతన్ సంస్థ ఎండీపై 14 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో మౌర్య హోటల్లో ఉన్న లీలాకుమార్ని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. లీలాకుమార్ని ధర్మవరం కోర్టులో హాజరుపరచారు దాంతో అతనికి కోర్టు 14రోజుల రిమాండు విధించింది.
ఎండీ లీలా కుమార్, డైరెక్టర్ లక్ష్మీశారద, అడిషనల్ డైరెక్టర్లు రాజకృష్ణ, వెంకటరవిప్రసాద్ల పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంస్థ డైరెక్టర్ లక్ష్మీశారదను పోలీసులు ఆ మధ్య క్రితం హైదరాబాదులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.