'కేజ్రీవాల్ అంశాన్ని సాకుగా చూపి చంద్రబాబు నీతి అయోగ్ సమావేశం బహిష్కరణ'
గుంటూరు: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అతిగా స్పందిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కేజ్రీవాల్ అంశాన్ని సాకుగా చూపి నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తారన్నారు.
ఢిల్లీలో హైడ్రామా: కేజ్రీవాల్ను కలిసేందుకు చంద్రబాబు-మమతలకు నో, భార్యతో భేటీ
ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న హడావుడి ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడిని తలపిస్తోందని మండిపడ్డారు. ఆయన ఏపీలో పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువ అయ్యాయన్నారు. టీడీపీ నేతలు నిందితులకు కొమ్ము కాస్తున్నారని చెప్పారు.
ఢిల్లీలో ఇటీవల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆకుల సత్యనారాయణల భేటీపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై కూడా కన్నా స్పందించారు. తమ పార్టీ నేత ఆకులను పరామర్శించేందుకే బుగ్గన వచ్చారని చెప్పారు. ఇతరులకు నీతులు చెప్పే పరిస్థితి యనమల రామకృష్ణకు ఉందా అని ఎద్దేవా చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ద్రోహం చేసిన చంద్రబాబు పంచన యనమల చేరారన్నారు.