చార్జీలు పెంచి... సీఎం జగన్ యూటర్న్ తీసుకున్నారు...
జగన్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచి ఇచ్చిన మాట నుండి యూ టర్న్ తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. ఎన్నికల్లో మాట తప్పను మడమ తిప్పను అని ప్రచారం చేసిన సీఎం చార్జీలు పెంచి యూటర్న్ తీసుకున్నారని ఆయన విమర్శించారు. ఈనేపథ్యంలోనే రాష్ట్రాన్ని వెనక్కి పరుగెత్తించాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. చార్జీల పెంపుదల నేపథ్యంలోనే ప్రభుత్వానికి లేఖ రాశారు.
లేఖలో పలు అంశాలను ప్రస్తావించిన ఆయన వైఎస్ వివేకా హత్య కేసునును చేధించడంలో పోలీసులు వైఫల్యం చెందారని, కనీసం కేసులో నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని పేర్కోన్నారు. అసలు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దృష్టి సారించలేదని ఆరోపణలు చేశారు. దీంతో పోలీసుల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన లేఖలో కోరారు.