వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాటి నుంచి జగన్ దాకా, మమ్మల్ని రెడ్లు అణగదొక్కారు: కాపు నేత సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: కాపులను రెడ్లు అణగదొక్కారన్నది వాస్తవమని, చరిత్ర తిరగేసి చూడాలని, నేను చెప్పింది తప్పయితే తనన గోదావరి గట్టున ఉరివేయాలని కాపు కార్పోరేషన్ చైర్మన్ రామాంజనేయులు మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారని వార్తలు వస్తున్నాయి.

ఆయన తూర్పు గోదావరి జిల్లాలో మాట్లాడారు. దివంగత నీలం సంజీవ రెడ్డితో పాటు దివంగత ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానంద రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం కాపులను అణగదొక్కారని ఆరోపించారు.

 Kapu leader interesting comments

మెట్ల ముఖ చిత్రాలతో కాపుమిత్ర

మాజీమంత్రి దివంగత మెట్ల సత్యనారాయణ రావు ముఖచిత్రాలతో రూపొందించిన కాపుమిత్ర సంచికలను కోనసీమ ఐక్యకార్యాచరణ సమితి నాయకుల ఆధ్వర్యంలో ఆయన కుమార్తె, కాకినాడ ఎంపీ తోట నరసింహం సతీమణి తోట వాణి సోమవారం నాడు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తండ్రి లేని లోటుని పూడ్చలేనిదన్నారు. కోనసీమకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి జీవిత చరిత్రను కాపుమిత్ర సంచికలో చేర్చడం అభినందనీయమన్నారు.

English summary
Kapu leader interesting comments in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X