రోడ్డు ప్రమాదం: మంత్రాలయంలోనుంచి వెళ్తూ కర్ణాటక మహిళ మృతి
కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయంలో గల శ్రీరాఘవేంద్ర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందినవారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామ శివారులో ఈ సంఘటన శనివారనాడు చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన శాంతమ్మ (55) కుటుంబ శనివారం ఉదయం మారుతి కారులో మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్ర స్వామిని దుర్శించుకుని వెళ్తుండగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న శాంతమ్మ అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
తండ్రిని చంపిన తనయుడు
మద్యం మత్తులో వేధిస్తున్న తండ్రిని ఓ తనయుడు హతమార్చారాడు. ఇనుపరాడ్తో అతను తండ్రిపై దాడి చేశాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని గన్నవారి పాలెం కాలనీలో ఈ సంఘటన జరింది. మద్యానికి బానిసై ఐదేళ్ల క్రితం తన పెద్ద కుమారుడు రాజును అప్పట్లో హత్య చేశాడు.
భార్య రాజమ్మను, కుమారుడు నురేష్ (16)ను కూడా తరుచుగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రతి దాటిన తరవ్తా రాజమ్మతో గొడవ పడ్డాడు. తల్లిని కూడా చంపేస్తాడేమోనని భయపడి సురేష్ రాడ్ తీసుకుని తన తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో ఓబులేస్ అక్కడికక్కడ మరణించాడు. తండ్రిని తానే చంపానని అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు. సురేష్ ఐటిఐ చదువుతున్నాడు.