కాంగ్రెసుకు ఝలక్: చేతులెత్తేసిన కాసు కృష్ణారెడ్డి

తాను పోటీ చేయలేననే విషయాన్ని పిసిసికి చెప్పానని, గత్యంతరం లేదంటే అప్పుడు ఆలోచిస్తానని కాసు వెంకటకృష్ణా రెడ్డి అన్నారు. నర్సారావుపేట శాసనసభ నియోజకవర్గానికి పోటీ చేయలేనని కాసు వెంకటకృష్ణా రెడ్డి తనయుడు మహేష్ రెడ్డి బుధవారంనాడే చెప్పారు.
గత 60 ఏళ్లుగా కాసు కుటుంబానికి నర్సారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెసుతో అనుబంధం ఉంది. దాంతో తాను పోటీ చేయడం లేదని కాసు కృష్ణా రెడ్డి ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ స్థితిలో కాంగ్రెసు కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిన స్థితిలో పడింది.
గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల కూడా తాను పోటీ చేయడం లేదని ఇదివరకే ప్రకటించారు. కాంగ్రెసుకు సీమాంధ్రలో ఈ విధమైన ఇబ్బందులు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications