బిజెపిది మోసం, టిడిపిది దగా, ప్రత్యేక హోదా ఏపీ హక్కు: కత్తి మహేష్
అమరావతి: ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై సినీ విమర్శకులు కత్తి మహేష్ టిడిపి, బిజెపిలపై నిప్పులు చెరిగారు. బిజెపిది మోసం, టిడిపిది దగా, ఇద్దరూ దొంగలేనని కత్తి మహేష్ ట్వీట్ చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై పలు పార్టీల నిరసన కార్యక్రమాల్లో కత్తి మహేష్ పాల్గొంటున్నారు. ఈ తరుణంలో మంగళవారం నాడు కత్తి మహేష్ చేసిన టిడిపి, బిజెపిలపై ట్వీట్ చేశారు. బిజెపిది మోసం, తెలుగుదేశం పార్టీది దగా అని కత్తి మహేష్ ట్వీట్ చేశారు. ఇద్దరూ దొంగలే , 420లే అంటూ మహేష్ ట్వీట్ చేశారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా రెండు పార్టీలు ఘరానా మోసం చేశాయని కత్తి మహేష్ ఆరోపించారు.ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై కత్తి మహేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అంటూ కత్తి మహేష్ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్ కాదన్నారు.కత్తి మహేష్ ట్వీట్పై నెటిజన్లు పాజిటివ్గా స్పందిస్తున్నారు. కొందరు మహేష్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.