వైసిపి లోకి కావూరి..! జగన్ తో భేటీ : ఏలూరు లోక్సభ బరిలోకి ..!
వైసిపి లోకి మరో సీనియర్ నేత. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేసిన కావూరు సాంబశివరావు వైసిపి లో చేర టానికి రంగం సిద్దమైంది. ఆయన ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు. సీనియర్ రాజకీయ నేతగా గుర్తింపు ఉన్న కావూరి ఇ ప్పటికే వైసిపి కీలక విజయ సాయిరెడ్డితో మంతనాలు జరిపినట్లు సమాచారం. జగన్ తో భేటీకి రంగం సిద్దమైంది. ఈ చేరిక కోసం ఆయన ఏలూరు లోక్సభ సీటు ఆశిస్తున్నారు.
వైసిపి
లోకి
కావూరి
ఎంట్రీ..
కాంగ్రెస్
పార్టీ
సీనియర్
నేత..
కేంద్ర
మాజీ
మంత్రి
కావూరి
సాంబశివరావు
వైసిపి
ఎంట్రీ
దాదాపు
ఖాయమైంది.
ఆయన
కాంగ్రెస్
పార్టీ
నుండి
అయిదు
సార్లు
ఎంపీగా
గెలిచారు.
మచిలీపట్నం
లోక్సభ
నియోజకవర్గం
నుండి
1984,
1989,
1994
లో
కావూరి
సాంబశివరావు
గెలుపొందారు.
ఆ
తరువాత
2004
నుండి
ఆయన
ఏలూరు
లోక్సభ
స్థానం
నుండి
పోటీ
చేసారు.
2004,2009
లో
ఆయన
ఏలూరు
లోక్సభ
నుండి
గెలిచారు.
2014
లో
రాష్ట్ర
విభజన
కు
ముందుగా
ఆయనకు
యూపిఏ
ప్రభుత్వంలో
ఆయనకు
కేంద్రంలో
క్యాబినెట్
పదవి
దక్కింది.
అప్పటి వరకు ఆయన కాంగ్రెస్ ఎంపీగా ఉం టూనే సమైక్యాంధ్ర వాయిస్ బలంగా వినిపించారు. ఇక, రాష్ట్ర విభజన సమయంలో ఆయన కాంగ్రెస్ ను వీడి బిజెపి లో చేరారు. ప్రస్తుతం ఏపిలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన బిజెపిని వీడి వైసిపి లో చేరాలని భావిస్తున్నారు.
ఏలూరు
లోక్సభ
నుండి
బరిలోకి..
వైసిపి
లో
చేరే
అంశం
పై
ఆయన
ఇప్పటికే
జగన్
తో
మంతనాలు
సాగించినట్లు
తెలుస్తోంది.
వైసిపి
ముఖ్యనేత
విజయ
సాయి
రెడ్డి
తోనూ
చర్చలు
జరిగినట్లు
సమాచారం.
అందులో
ప్రధానంగా
ఏలూరు
లోక్సభ
స్థానం
నుండి
పోటీ
చేసే
అవకాశం
పై
చర్చ
జరిగినట్లు
తెలుస్తోంది.
వైసిపి
నుండి
2014
ఎన్నికల్లో
ఏలూరు
లోక్సభ
స్థానం
నుండి
పోటీ
చేసిన
తోట
చంద్రశేఖర్
ప్రస్తుతం
జనసేన
లో
ఉన్నారు.
ఇక,
టిడిపి
నుండి
మాగంటి
బాబు
బరిలో
ఉన్నారు.
ఈ సారి టిడిపి ఎంపీగా మాగంటి బాబు పోటీ చేస్తారా..లేకే ఆయన ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తారా అనేది క్లారిటీ లేదు. దీంతో..ఏలూరు లో పట్టు ఉన్న కావూరి సాంబశివరావు వైసిపిలోకి వస్తే..అక్కడ సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆ లోక్సభ సీటు గెలవ చ్చనే అంచనా లో వైసిపి ఉంది. కావూరు సాంబశివరావును వైసిపిలోకి తెచ్చేందుకు దగ్గుబాటి వేంకటేశ్వరావు కీలక భూమిక పోషిస్తున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఆయన వైసిపిలో చేరటం ఖాయమని పార్టీ నేతలు చెబుతు న్నారు. కావూరు చేరిక ద్వారా టిడిపికి అండగా నిలిచే బలమైన సామాజిక వర్గం లోని కీలక నేతలు వైసిపి వైపు ఆకర్షితు లవ్వటం ఇక రకంగా టిడిపికి నష్టంగానే భావించాలి.