కెసిఆర్ భార్య బతుకమ్మ: కెసిఆర్తో జిఎంఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సతీమణి శోభ బతుకమ్మ, దసరా పర్వదినాల శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యాలయం తెలంగాణ భవన్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
తెలంగాణ భవన్లో ఆమె ఇతర మహిళలతో చేతులు కలిపి బతుకమ్మ ఆడారు. ఈ వేడుకల్లో తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణ డిజిపి కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి.
తెలంగాణ సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణాల్లో కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళా ఉద్యోగులంతా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. సచివాలంయలో మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత బొడ్డెమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీలో బతుకమ్మ వేడుకలకు మండలి చైర్మన్ స్వామి గౌడ్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో జిఎంఆర్ ప్రతినిధులు శుక్రవారంనాడు సమావేశమయ్యారు. ఏరోస్పేస్ ప్రాజెక్టుపై జిఎంఆర్ ప్రతినిధులు ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు ప్రోత్సహకాలు ఇవ్వాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.