వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధుసూదనాచారికి అస్వస్థత: నిమ్స్‌లో పరామర్శించిన కెసిఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనారోగ్య కారణంగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మంగళవారం ఉదయం పరామర్శించారు. వడదెబ్బతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ మధుసూదనాచారి నిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే.

నిమ్స్‌లో మధుసూదనాచారిని ముఖ్యమంత్రి కెసిఆర్ పరామర్శించారు. నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పీకర్‌కు మెరుగైన వైద్యం ఇవ్వాలని డైరెక్టర్‌కు సీఎం సూచించారు.

KCR visits Speaker Madhusudhana Chary in NIMS

సిఎం వెంట శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు జితేందర్ రెడ్డి, నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.

తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా బేగంపేట పర్యాటక భవన్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్‌ను రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఫుడ్ ఫెస్టివల్‌లో పలు రకాల తెలంగాణ వంటకాలు కొలువుదీరాయి.

English summary
Telangana chief minister KCR has visited NIMS hospital to check on the health of Telangana Speaker Madhusudhana Chary, who was admitted in the hospital due to sun stroke. KCR told NIMS Director Narendra Nath to provide good treatment to Chary and wished him speedy recovery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X