వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతిని నిరూపిస్తే కేబినెట్ రాజీనామా, జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు: కేఈ

దశాబ్దాలపాటుట తలకిందులుగా తపస్సుచేసినా వైసీపీ అధినేత జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని ఏపీ డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. ఆదివారంనాడు ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజు క

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: దశాబ్దాలపాటుట తలకిందులుగా తపస్సుచేసినా వైసీపీ అధినేత జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని ఏపీ డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు.
ఆదివారంనాడు ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజు కొడుకు రాజు అవడం సమంజసమే కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజాభిమానం , అనుభవం లేకుండా మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా సీఎం కావాలనుకోవడం గాలిమేడలు కట్టడమేనని చెప్పారు.

KE Krishnamurthy challenges to Ysrcp over on allegations on Chandrababu

పదే పదే రాజన్న పాలన తెస్తామని వైసీపీ చెబుతోందన్నారు. గనుల దోపిడి, భూ కబ్జాలు, లక్షలకోట్లు అవినీతి మళ్ళీ తీసుకురావడమేనా అని ఆయన విమర్శించారు.చంద్రబాబుపై విమర్శలే లక్ష్యంగా ప్లీనరీని నిర్వహించారన్నారు.

ప్రజాప్రయోజన కార్యక్రమాలు, రాష్ట్రాభివృద్ది, ప్రత్యేక ప్యాకేజీపై చర్చించాలని ఆయన హితవు పలికారు.చంద్రబాబుపై చేసిన లక్షల కోట్ల అవినీతి ఆరోపణలను నిరూపిస్తే కేబినెట్ మొత్తం రాజీనామా చేస్తామని కేఈ సవాల్ విసిరారు.

దశాబ్దాలపాటు తలకిందులుగా తపస్సుచేసినా జగన్ సిఎం కాలేడని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి చెప్పారు.

లక్షలకోట్ల అవినీతి, గనుల దోపిడిని తీసుకోనిరావడమేనా రాజన్న రాజ్యమా అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబుపై అనినీతి ఆరోపణలు నిరూపిస్తే కేబినెట్ మొత్తం రాజీనామా చేస్తామని ఆయన సవాల్ విసిరారు.

English summary
Ap Deputy chiefminister KE Krishnamurthy challenged to Ysrcp over on allegations on Chandrababu.If proved any allegations on Chandrababu Naidu, whole cabinet will resign he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X