బైరెడ్డి ఎఫెక్ట్: కర్నూలు ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ఏకగ్రీవం
Recommended Video
అమరావతి/కర్నూలు: కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఎన్నికల సంఘం అధికారులు కేఈని ఎమ్మెల్సీగా ప్రకటించారు.
నిన్నమొన్నటి వరకు తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఈ ఎన్నికలు చివరకు ఏకగ్రీవమైంది. కేఈతోపాటు మొత్తం నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా, ఓ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. బీఎస్పీ అభ్యర్థి నామినేషన్ను అనర్హుడిగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం తిరస్కరించింది.
ఇక ఎంపీటీసీల సంఘం నేత జయప్రకాశ్ రెడ్డి గురువారం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో మాట్లాడారు. ఆ తర్వాత జయప్రకాశ్ రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ కావడం గమనార్హం.
జగన్ మాటతో వెనక్కి తగ్గిన వెంకటరెడ్డి: అయినా పోటీ తప్పదా!, నామినేషన్ దాఖలు
ఈ సమావేశంలో బైరెడ్డిని చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఇందుకు బైరెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బైరెడ్డి అనుచరుడైన జయప్రకాశ్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో కేఈ ప్రభాకర్ మాత్రమే నిలిచినట్లయింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది.