టీడీపీపై అలాంటి వ్యాఖ్యలా?: పవన్ ఓటమి ఖాయం, డబ్బుల యావే, : నాని, జవహర్ నిప్పులు
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై టీడీపీ ఎంపీ కేశినేని నాని, మంత్రి జవహర్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. బుధవారం నాని మీడియాతో మాట్లాడుతూ.. పవన్ సోదరుడు చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 సీట్లు మాత్రమే గెలిచారని అన్నారు.
పవన్.. ఎక్కడ పోటీ చేసినా ఓటమే.. వార్నింగ్
పవన్ మాత్రం ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతాడని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్, అతన్ని చూడటానికి మాత్రమే ప్రజలు వస్తారు.. అంతేగానీ వాపును చూసి బలుపు అనుకోకూడదని హితవు పలికారు. పవన్ కల్యాణ్ తన బలం, బలహీనత తెలుసుకుని మాట్లాడాలని నాని హెచ్చరించారు.
బీజేపీని కాపాడేందుకే..
మరోవైపు, ఏపీ మంత్రి జవహర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీని కాపాడటానికే చంద్రబాబుపై పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
పవన్ వ్యాఖ్యలు అర్ధరహితం
చంద్రబాబును దించాలనే లక్ష్యం తప్ప, ప్రజాసమస్యల పట్ల పవన్కు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఖర్చు పెట్టేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారనే పవన్ వ్యాఖ్యలు అర్ధరహితమైనవన్నారు.
డబ్బుల యావే
ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే డబ్బులు తీసుకోవడం పవన్కు అలవాటుగా మారిందని జవహర్ ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ డబ్బులు అనే యావ పవన్కు పట్టిందని విమర్శించారు. మూడు రోజులు ఆంధ్రాలో తిరిగి, ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్కు చెక్కేసే పవన్ను ప్రజలు నమ్మరని జవహర్ వ్యాఖ్యానించారు.