లోకేష్, రేవంత్లకు కీలక పదవులు: నిమ్మకూరుని దత్తత తీసుకున్న మనవడు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో టిడిపి యువనేతలు నారా లోకేష్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కీలక పదవులు దక్కనున్నాయి. టిడిపి జాతీయ, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీలను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకటించనున్నారు.
నారా లోకేష్, రేవంత్ రెడ్డిలకు పదవులు కట్టబెట్టనున్నారు. కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శులుగా రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొనకళ్ల నారాయణ, నారా లోకేష్లు ఉండనున్నారని తెలుస్తోంది. ఉపాధ్యక్షులుగా రాములు, మాగుంట, డి సత్యప్రభ ఉండనున్నారని తెలుస్తోంది.
అధికార ప్రతినిధులుగా బొండా ఉమమహేశ్వర రావు, పెద్దిరెడ్డి, రామ్మోహన్ నాయుడు, పయ్యావుల కేశవ్ ఉండనున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్ రమణ కొనసాగనున్నారు. ఏపీ అధ్యక్షులుగా కళా వెంకట్రావు ఉంటారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఉండనున్నారు.
నిమ్మకూరును దత్తత తీసుకున్న లోకేష్
టిడిపి యువనేత నారా లోకేష్ నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ... ప్రపంచం గర్వించేలా రాజధానిని నిర్మించేందుకు ఏపీ సీం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు.