వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకి కిరణ్ రెడ్డి నో: దిగ్విజయ్ లేరనా, ఇష్టం లేకేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. రచ్చబండ కార్యక్రమం నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వాయిదా పడినట్లుగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఈ నెల 18వ తేదీ వరకు అందుబాటులో ఉండటం లేదు.

ఈ నేపథ్యంలో డిగ్గీ అందుబాటులో లేనప్పుడు మంత్రుల బృందం(జివోఎం) భేటీకి వెళ్లాల్సిన అవసరం అంతగా లేదని కిరణ్ భావిస్తున్నారట. ఆయన వచ్చాక ఢిల్లీకి వెళ్లి జివోఎం ముందు వాదన వినిపించే అవకాశముందంటున్నారు.

విభజన అంశంపై రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల అభిప్రాయాన్ని జివోఎం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ జివోఎంను బహిష్కరించింది. పార్టీల అభిప్రాయం తీసుకున్న జివోఎం ముఖ్యమంత్రి అభిప్రాయం తీసుకునేందుకు ఢిల్లీకి రావాలని సూచించింది. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు జివోఎంతో ముఖ్యమంత్రి భేటీ కావాల్సి ఉంది. కానీ ఆయన వాయిదా వేసుకున్నారు.

ఢిల్లీ పర్యటన వాయిదాకు రచ్చబండ కార్యక్రమం, దిగ్విజయ్ లేకపోవడం వంటి కారణాలు చెబుతున్నప్పటికీ కిరణ్ కావాలనే వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. అధిష్టానం నిర్ణయాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్న కిరణ్ విభజించిన తర్వాత సమస్యలపై అభిప్రాయాలు అడుగుతున్నప్పుడు వెళ్లడమెందుకని ఆయన భావిస్తున్నారట. కిరణ్ వైఖరి ద్వారా సీమాంధ్రలో మరింత మైలేజ్ వస్తుందంటున్నారు.

English summary

 CM Kiran Kumar Reddy's delhi tour postponed due to Rachabanda programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X