కిరణ్పై షిండేను రిక్వెస్ట్ చేసిన తివారీ, నాతో ఆగదని కిల్లి
మనీష్ తివారీ కోరిక మేరకే కిరణ్ ఢిల్లీ పర్యటన వాయిదా పడిందని ఏఐసిసి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు కిరణ్ జివోఎంతో భేటీ కానున్నారు. కిరణ్ ఢిల్లీ పర్యటన వాయిదా వెనుక రచ్చబండ, ఆసక్తి లేకపోవడం అని అందరూ భావించారు. అయితే అధిష్టానం మాత్రం తివారీ వస్తున్నందు వల్లనే అని చెబుతోంది.
సిఎం మార్పుపై సమాచారం లేదు: శైలజానాథ్
ముఖ్యమంత్రి మార్పు పైన తమకు ఎలాంటి సమాచారం లేదని మంత్రి శైలజానాథ్ హైదరాబాదులో చెప్పారు. తివారీ వస్తున్నందువల్లే కిరణ్ పర్యటన వాయిదా పడిందని తాను భావిస్తున్నానని చెప్పారు.
నేను అంగీకరించకున్నా ఆగదు: కిల్లి
తాను అంగీకరించకున్నా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శ్రీకాకుళం జిల్లాలో చెప్పారు. బిజెపి యూ టర్న్ తీసుకుంటే తప్ప విభజన ఆగదన్నారు. టిడిపి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఇప్పుడు జివోఎం ముందుకు వెళ్లకుండా డ్రామాలు ఆడుతోందన్నారు.