ఒక్కటే మార్గం: బిజెపి వైపు చూస్తున్న కిరణ్ రెడ్డి?
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసుతో పాటు జై సమైక్యాంధ్ర పార్టీ కూడా ఘోరంగా విఫలమయ్యాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు.
తన సొంత నియోజకవర్గం పీలేరులో తన సోదరుడిని నిలిపారు. కానీ ఆయన కూడా పరాజయం పాలయ్యారు. తిరిగి కాంగ్రెసులో చేరడానికి కిరణ్ రెడ్డి సిద్దంగా లేరని అంటున్నారు. ప్రస్తుత తరుణంలో బిజెపిలో చేరడమే మంచిదని ఆయనకు సన్నిహితులు సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. బిజెపిలో చేరే విషయంపై చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.

రాష్ట్ర విభజనలో బిజెపి పాత్ర కూడా ఉన్నందున ఆ పార్టీలో చేరేందుకు కిరణ్ రెడ్డి తొలుత విముఖత ప్రదర్శించారని అంటున్నారు. ఆయన సన్నిహతులు, సోదరులు సర్దిచెప్పడంతో ఆయన అందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు.
గుజరాత్కు చెందిన వ్యాపార వర్గాల ద్వారా గానీ కర్ణాటకకు చెందిన వర్గాల ద్వారా గానీ కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. బిజెపిలో చేరడం ద్వారా తిరిగి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications