కిరణ్ రెడ్డి రాజీనామాపై బాలరాజు: అశోక్ బాబుపై కేసు!
విశాఖ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనడం కేవలం ఊహాజనితమేనని మంత్రి పసుపులేటి బాలరాజు మంగళవారం విశాఖపట్నంలో అన్నారు. సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
సమైక్యాంధ్ర కోసం ప్రజల అభిప్రాయాలను చెప్పడంలో నేతల మధ్య సమన్వయం కొరవడిందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెబుతున్న వారు తమ ఉద్దేశ్యం ఎన్నికలో లేక సమైక్య రాష్ట్రమో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఫ్యాషనైపోయింది: రేవూరి
తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని విమర్శించడం కాంగ్రెస్, తెరాస నాయకులకు ఫ్యాషనైపోయిందని తెలంగాణ టిడిపి నేత రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్లో మండిపడ్డారు. కాంగ్రెస్ అవినీతిని ప్రజలే గుర్తించారన్నారు. కాంగ్రెస్, తెరాస వల్ల తెలంగాణ రావడం లేదని విమర్శించారు. తెలంగాణకు కెసిఆరే ప్రధాన ద్రోహి అన్నారు.
అశోక్ బాబుపై కేసు నమోదు చేయండి
ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు పైన కేసు నమోదు చేయాలని మల్కాజిగిరి పోలీసులను స్థానిక న్యాయస్థానం ఆదేశించింది. అశోక్ బాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారనే ఫిర్యాదు మేరకు న్యాయస్థానం స్పందించింది. జనవరి 7వ తేదీలోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications