వారు ఇటు, వీరు అటు: టికి కెవిపి, ఎపికి చిరు, కెకె
ఢిల్లీ: రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ లాటరీ పద్ధతిలో రాజ్యసభ సభ్యుల పంపకాన్ని శుక్రవారం పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఎంపీలను విభజించారు. ఆంధ్రప్రదేశ్కు 11, తెలంగాణకు ఏడుగురు రాజ్యసభ సభ్యులను కేటాయించారు.
తెలంగాణకు వీరే... వి హనుమంత రావు, గుండు సుధారాణి, రాపోలు ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, సిఎం రమేష్, కెవిపి రామచంద్ర రావు, గరికపాటి రామ్మోహన రావు
ఆంధ్రప్రదేశ్కు వీరే... దేవేందర్ గౌడ్, చిరంజీవి, సుజనా చౌదరి, జైరామ్ రమేష్, టి సుబ్బిరామి రెడ్డి, జెడి శీలం, రేణుకా చౌదరి, కె కేశవ రావు, ఎంఏ ఖాన్, సీతారామలక్ష్మి.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి స్థానం ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు.
కెకె స్పందన
తాను తెలంగాణవాడినని రాజ్యసభ సభ్యులు కె కేశవ రావు అన్నారు. తాను రిటైర్ అయ్యాక తన స్థానాన్ని ఆంధ్రా వారితో భర్తీ చేస్తారని ఆయన విమర్శించారు.