వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి ప్రత్యేక హోదాపై కేకే ఓకే కానీ, టీకీ: తెరాస ఎంపీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు స్వాగతించారు. అయితే, తెలంగాణ కూడా వెనుకబడి ఉన్నందున ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు జరిపినట్లు తెలంగాణకు ఇవ్వలేదని కేకే ఆవేదన వ్యక్తం చేశారు.

KK welcomes special status to AP

ప్రత్యేక హోదా ఇవ్వాలి: తెరాస డిమాండ్

తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు గురువారం డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయే పక్షాలు పాలనలో ఉన్న రాష్ట్రాలకే ఎక్కువ కేటాయింపులు జరిపారని వారు ఆరోపించారు.

తెలంగాణలోని ఎనిమిది జిల్లాలు వెనుకబడి ఉన్నాయని తెరాస ఎంపీలు గుర్తు చేశారు. గతంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటనలో 14 అంశాల పైన వినతి పత్రం ఇవ్వగా ఒక్క దాని పైన కూడా స్పందించలేదని వారు అన్నారు.

అవరోధాలను అధిగమించేలా: మోడీ

ప్రజలను భాగస్వాములను చేస్తూ.. వారిని శక్తిమంతులుగా తయారు చేసే బడ్జెట్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా బడ్జెట్ ఉందని కొనియాడారు. దశాబ్దకాలంగా ఉన్న అవరోధాలను అధిగమించేలా రూపకల్పన జరిగిందన్నారు.

English summary
TRS senior leader K Keshava Rao welcomed special status to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X