కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు షాక్ మీద షాక్: టిడిపిలోకి కొత్తపల్లి, కావలి ఎమ్మెల్యే?

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. వరుసగా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారు. శనివారం నాడు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సైకిల్ ఎక్కారు.

మరో ఎమ్మెల్యే, ఇంకో కీలక నేత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని తెలుస్తోంది. ఆయన టిడిపిలోకి వచ్చేందుకే కలిశారని తెలుస్తోంది.

Kothapalli and Nellore MLA to join Telugudesam

ఇక, పశ్చిమ గోదావరి జిల్లా వైసిపి అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు పార్టీ అధినేత నుంచి పచ్చజెండా కూడా వచ్చిందని తెలుస్తోంది. వీరు త్వరలో టిడిపిలో చేరనున్నారని తెలుస్తోంది.

కాగా, కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి శనివారం టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. కర్నూలులోని వీజేఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన నీరు- చెట్టు కార్యగోష్ఠిలో టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిల్ ఎక్కారు. ఆయనతో పాటు భారీసంఖ్యలో కార్యకర్తలు కూడా టిడిపిలో చేరారు.

English summary
Kothapalli Subbarayudu and Nellore MLA Ramireddy Pratap Kumar Reddy to join Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X