వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్రలో చిరు ఢీ: పురంధేశ్వరి ఔట్, కృష్ణంరాజు ఇన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న చిరంజీవికి కౌంటర్‌గా.. భారతీయ జనతా పార్టీ తమ సీమాంధ్ర ప్రచార బాధ్యతలను రెబల్ స్టార్ కృష్ణంరాజుకు అప్పగించింది! సీమాంధ్ర ప్రచార బాధ్యతలను తొలుత మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి అప్పగించారు.

అయితే, ఆమె రాజంపేట లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఆమె పోటీలో ఉన్నందున సీమాంధ్ర ప్రాంతం పైన ప్రత్యేక దృష్టి సారించలేని పరిస్థితి ఏర్పడింది.

Krishnam Raju as BJP campaign chief for Seemandhra

దీంతో బిజెపి తాజాగా మాజీ కేంద్రమంత్రి, రెబల్ స్టార్ కృష్ణం రాజుకు ఆ బాధ్యతలు అప్పగించింది. కృష్ణం రాజును ప్రచార కమిటీ కన్వీనర్‌గా నియమిస్తూ హరిబాబు ప్రకటన చేశారు.

టిడిపి, బిజెపి పార్టీలకు మద్దతుగా ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో రాజశేఖర్, దర్శక నిర్మాత జీవితలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. సీమాంధ్రలో 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. పవన్ కళ్యాణ్, రాజశేఖర్, జీవితలు తెలంగాణలో ఎన్నికల అనంతరం సీమాంధ్రలో పర్యటించనున్నారు.

English summary
Rebel Star Krishnam Raju as BJP campaign chief for Seemandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X