మచీలిపట్నం పోర్టు ,తెలంగాణకు పోతుందన్న లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన కేటిఆర్
ఎన్నికలు వచ్చిన వేళ ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, ఏపి మంత్రి , నారా లోకేష్ కామేడి పండిస్తున్నారు. రోజుకో కామేంట్ లేదా ఫోటోతో నెటిజన్లకు కామేడీ పీస్ గా మారి పోయాడు,ఎన్నికల ప్రచారంలో నిత్యం రాజకీయ పరమైన వార్తలతో ప్రజలకు దగ్గరకు కావాల్సిన ఆయన , తాజాగా మచీలీ పట్నం పోర్టుపై చేసిన వ్యాఖ్యలు ఏకంగా ''నెట్ ఇంట్లో'' హల్చల్ చేస్తున్నాయి.
వైఎస్ వివేక మరణంతో పరవశించిపోయాను
గతంలో చాల సార్లు తన మాటల్లో తప్పులు దొర్లిన లోకేష్ బాబు...ఇప్పుడు తాజాగా వైఎస్ వివేకా హత్య అనంతరం మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. వైఎస్ వివేక మరణం తనను షాక్ కు గురి చేసింది అనబోయి ''పరవశించిబోయాను '' అన్నాడు,అంతకుముందు ప్రతీ గ్రామానికి తాగునీటీ సమస్య లేకుండా చేస్తాను అని చెప్పబోయి, ''తాగునీరు లేని సమస్యను'' ఏర్పాటు చేస్తామని అన్నారు.
కళ్లు మూసుకుని సెల్ఫీ
తాజగా ఆయన వ్యవహార శైలి మరోసారి మిస్ ఫైర్ అయింది.. ఓ సెల్ఫి విషయంలో ఆయన మరోసారి నెటిజన్లకు దొరికిపోయాడు. ఓ అమ్మాయి లోకేష్ తో సెల్ఫి తీసుకుంటున్న సమయంలో ఆయన కళ్లు మూసుకోవడం పై నెటిజన్లు పలు కామేడిలు చేస్తున్నారు.
సముద్రం లేని ప్రాంతానికి పోర్టును ఎలా తరలిస్తారు ?
ఇది ఇలా ఉండగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై రాజకీయపరమైన విమర్శలు చేయబోయి ఇరుక్కున్నాడు. ''మచిలీపట్నం పోర్టు ను తెలంగాణ సిఎమ్ కేసిఆర్ తరలించుకుపోయో కుట్రలు పన్నుతున్నారని'' అన్నారు. ఇక ఈ కామెంట్స్ తో నెటిజన్లు లోకేష్ పై సెటైర్లు వేస్తున్నారు..లోకేష్ కామేంట్ ను ట్వీట్ చేస్తూ.. ''మచీలీపట్నం పోర్టును తెలంగాణ కు తీసుకురాలేని టిఆర్ఎస్ పార్టీకి , ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయమని'' ట్వీట్ చేశారు.
పోర్టు కామెంట్స్ పై కేటిఆర్ స్పందన
సో ఇప్పటికైన రాజకీయ నాయకులు చాల జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే గతంలో టీవీలు మాత్రమే పలుసార్లు వేసి తిప్పేవారు..ఇప్పుడు నెటిజన్లకు దొరికితే అది అంతే సంగతులు...