వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నూలు జిల్లాలో ఆటవిక ఘటన .. భార్యను కాపురానికి పిలిచినందుకు మర్మాంగం కోసి ఆపై ..

|
Google Oneindia TeluguNews

కర్నూలు జిల్లాలో ఆటవిక సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టి, అతని మర్మాంగాన్ని కోసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అత్యంత జుగుప్సాకరంగా జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

ఇక అసలు విషయానికి వస్తే కర్నూలు జిల్లా గడివేముల మండలం సోమాపురం లో జరిగిన ఈ ఘటనలో మూడు సంవత్సరాలుగా పుట్టింటికి పరిమితమైన భార్యను కాపురానికి రమ్మని పిలిచేందుకు భర్త ఆమె పుట్టింటికి వెళ్ళాడు. ఇక అక్కడ భార్య తరపు బంధువులు అతనిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. విచక్షణారహితంగా కొట్టారు తాడుతో కట్టేసి అత్యంత కిరాతకంగా అతనిని హింసించారు.

Kurnool district A man brutally harrassed by his wifes relatives

ఇక అంతటితో ఆగకుండా అతని మర్మాంగాన్ని కోసేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సభ్య సమాజం షాక్ కు గురయ్యేలా అత్యంత అమానవీయంగా చోటు చేసుకున్న ఈ ఘటన కర్నూలు జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

English summary
The incident occurred in Kurnool district. The incident of a man being brutally beaten and chopped off his private part become a local sensation. The most egregious attack was that the victim was rushed to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X