ఎంపీ సీటు: సోనియాపై కెవిపి ఆశ, జగన్పై కృష్ణంరాజు
త్వరలో గవర్నర్ అవుతా
గవర్నర్ కావాలన్న తన చిరకాల వాంఛ అతి త్వరలోనే నెరవేరుతుందని ఎమ్మెస్సార్ ఆశాభావం వ్యక్తం చేశారు. గవర్నర్ పదవిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనకు ఏడేళ్ల కిందటే హామీ ఇచ్చారన్నారు. మరో చిరకాల స్వప్నం తెలంగాణ కూడా సాకారం కానుందన్నారు.
ఎమ్మెస్సార్కు కెవిపి రామచంద్ర రావుతో పాటు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖేశ్ గౌడ్, లోక్సభ సభ్యులు వివేక్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
జగన్తో విభేదాలపై రఘురామ కృష్ణంరాజు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో తనకు విభేదాలు ఉన్నట్లుగా వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణం రాజు వేరుగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. జగన్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నానని తెలిపారు.