వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బడ్జెట్ ఎఫెక్ట్: రాజ్యసభలో కేవీపీ నిరసన, ప్లకార్డుల ప్రదర్శన
న్యూఢిల్లీ: బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు శుక్రవారం రాజ్యసభలో నిరసన తెలిపారు. హామీలు విస్మరిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
బడ్జెట్: నిన్న బాబు, నేడు పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగొచ్చిన నరేంద్ర మోడీ?
కేవీపీ ఈ మేరకు ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీకి సాధారణ బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేశారని ఆయన నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ వైస్ చైర్మన్ పదేపదే ఆయనను కూర్చోమని చెప్పాల్సి వచ్చింది. కేవీపీ తీరుపై కురియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెల్ నుంచి వెళ్లిపోవాలని పదేపదే చెప్పారు. విపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో రాజ్యసభ వాయిదా పడింది.
టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు వేరుగా మాట్లాడుతూ.. విశాఖపట్నంకు రైల్వే జోన్ వస్తుందన్న నమ్మకం తమకు లేదని చెప్పారు.
Comments
rajya sabha budget reactions 2018 rayapati sambasiva rao narendra modi arun jaitley budget budget facts budget investments 2018 budget 2018 కేవీపీ రామచంద్ర రావు రాజ్యసభ కేంద్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ 2018 అరుణ్ జైట్లీ రాయపాటి సాంబశివ రావు
English summary
Congress MP KVP Ramachandra Rao protest in Rajya Sabha over Union Budget 2018.