శారదాపీఠంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న లక్ష చండీయాగం, అతిరుద్ర యాగం
విశాఖపట్టణం:విశాఖ శారదా పీఠంలో లక్ష చండీయాగం, అతిరుద్ర యాగం అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వీయ పర్యవేక్షణలో శుక్రవారం ప్రారంభమైన ఈ పవిత్ర యాగాలకు శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.
ప్రతీ ఏటా భక్తిశ్రద్దలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ యాగాలు ఈ ఏడాది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. తొలుత గోపూజతో ప్రారంభమై, గణపతిపూజ, దీక్షాదారణ, ఋత్విగరన, అగ్నిమధనం నిర్వ హించారు. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి సౌజన్యంతో పది సంవత్సరాలుగా శారదాపీఠంలో ఈ యాగాలు నిర్వహిస్తున్నారు.
శారదా పీఠంలో...పవిత్ర యాగాలు
విశాఖ శారదా పీఠంలో లక్ష చండీయాగం, అతిరుద్ర యాగం నిర్వహణ కోసం వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన సుమారు 300 మంది రుత్విక్లు ఈ యాగంలో భాగస్వాములయ్యారు. తొలుత గోపూజతో ప్రారంభించి ఆ తరువాత గణపతిపూజ, దీక్షాధారణ, ఋత్విగరన, అగ్నిమధనం తో యాగ క్రమాన్ని కొనసాగించారు.
లోకకళ్యాణం కోసమే...ఈ యాగాలు
ఈ సందర్భంగా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతి భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేస్తూ దేశంలో ప్రజలందరూ సుఖసంతోషాలుతో ఉండాలని, వర్షాలు సకాలంలో కురిసి పాడిపంటలతో రైతన్నలు సంతోషంగా ఉండాలని తలంపుతో లోకకళ్యాణం కోసం ఈ యాగాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
భాగస్వామిని కావడం...అదృష్టం
ఇందుకోసం రాజ్యసభ సభ్యులు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి ప్రతీ ఏటా సంపూర్ణ సహకారం అందించడం జరుగుతోందని తెలిపారు. తదుపరి డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ లోకకళ్యాణం కోసం ప్రతీ ఏటా స్వరూపానందేంద్ర స్వామి వారు ఈ యాగాలు నిర్వహించడం, ఈ పవిత్ర కార్యాల్లో తమను కూడా భాగస్వా ములను చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వందలాది మంది రుత్విక్లు నియమ నిష్టలతో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
ఈనెల 6న...ముగింపు
భవిష్యత్తులో కూడా ఈ యాగాలను నిర్వహిస్తామని , తన తదుపరి తన వంశీయులు కూడా కొనసాగిస్తారని టిఎస్ఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ద్రోణంరాజు శ్రీనివాస్, బెహరా భాస్కరరావు, పేడాడ రమణికుమారి, పీఠం ట్రస్టీ నివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తర పీఠాధిపతి కిరణ్కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ యాగాలు ఈనెల 6న జరిగే పూర్ణాహుతితో ముగియనున్నాయి. యాగాలకు సంబంధించిన ఏర్పాట్లను పీఠం శ్రీకార్యం కామేశ్వరశర్మ పర్యవేక్షించారు.