లక్ష్మీ పార్వతి 16 ఏళ్ళ బాలాకుమారి కాదు .. ఎన్టీఆర్ ను స్టెరాయిడ్స్ ఇచ్చి చంపేసిందన్న దివ్యవాణి
తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ , తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకురాలు దివ్య వాణి రామ్ గోపాల్ వర్మపై నిప్పుల వర్షం కురిపించటంతో పాటు లక్ష్మీ పార్వతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు .
జగన్ నీ పాపపు సొమ్ము పంచితే వచ్చే జన్మలో అయినా సీఎం అవుతావ్ ... సాధినేని యామిని ఘాటు వ్యాఖ్యలు
లక్ష్మీపార్వతి చరిత్ర ఏంటో ఆమె మొదటిభర్త వీరగంథం గారు ఎప్పుడో చెప్పారని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ గారి జీవితంలోకి వచ్చే సమయానికి ఆమేమీ పదహారేళ్ల బాలాకుమారి కాదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే కోటి అనే యువకుడు కూడా తాను ఎలా వేధింపులకు గురైందీ సోషల్ మీడియాలో వెల్లడించాడని దివ్యవాణి పేర్కొన్నారు.
లక్ష్మీ పార్వతి చరిత్ర తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసన్నారు దివ్యవాణి. లక్ష్మీ పార్వతి కనీసం ఎన్టీఆర్ గారి వయసును కూడా గుర్తించకుండా స్టెరాయిడ్స్ ఇప్పించి చావుకు కారణమైందని దివ్యవాణి ఆరోపణలు చేశారు . నారా వారి కుటుంబం, నందమూరి కుటుంబాలు సంస్కారం ఉన్న కుటుంబాలు కాబట్టి ఆమె గురించి ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదన్నారు దివ్యవాణి. ఇక లక్ష్మీ పార్వతిపై దివ్యవాణి చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.