ఇదేం గోల..! రాజధాని భూముల్లో దొంగలు పడ్దారు
డిమాండ్ ఉన్నచోట వివాదం ఉండడం పరిపాటిగా మారిపోయింది. అసలు హక్కుదారుని పక్కకు నెట్టి, నాదంటే నాదన్న రీతిలో ఎడాపెడా కబ్జాలకు పాల్పడుతున్నారు కొంతమంది ప్రబుద్ధులు. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతిలో పరిస్థితి ఇప్పుడు దొంగలు పడ్ద చందంగా తయారైంది. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని కాచుకు కూర్చుంటున్న కబ్జా రాయుళ్లు అమాయకులెవరైనా కంట్లో పడ్డమే ఆలస్యం వెంటనే అక్కడ వాలిపోతున్నారు.
ముఖ్యంగా ఎన్.ఆర్.ఐ లే టార్గెట్ గా కబ్జాలకు పాల్పడుతున్నాయి కొన్ని ముఠాలు. వీరికి అధికారులు, అధికార పార్టీ వ్యక్తుల అండదండలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బయటపడ్ద ఓ కబ్జా భాగోతంలో పోలీసులు ప్రదర్శించిన అలసత్వ వైఖరిని చూసి చాలామంది ఇదే రకమైన అభిప్రాయాలను వ్యక్డం చేస్తున్నారు. గుంటూరు జిల్లా పెద్దకురవలపాడుకు చెందిన ఉన్నవ బుల్లయ్య చౌదరికి రాజధాని అమరావతిలో ఐదెకరాల 30 సెంట్ల భూమి ఉంది. నకిలీ పత్రాలను సృష్టించిన కొంతమంది కబ్జాదారులు ఆ భూమిలో పాగా వేశారు.

పోలీసులను ఆశ్రయిస్తే నిందితులను పట్టుకోవడానికి 8 నెలల సమయం పట్టిందని వాపోతున్నాడు బాధితుడు. రాజధానిలో కబ్జా కేసులు పెరిగిపోతున్న విషయాన్ని స్వయంగా ఎస్పీనే ఒప్పుకున్నారు. భూముల ధరలు ఆకాశన్నంటడం దీనికొక కారణమైతే.. అధికారులు, పార్టీ పెద్దల పేర్ల చెప్పి దందాలకు పాల్పడుతున్నవారు కూడా ఎక్కువైపోతున్నారు. అనిల్ కుమార్ అనే ఓ వ్యక్తి టీడీపీ నేతల పేర్లు చెప్పి చేస్తున్న దందా భాగోతాన్ని పోలీసులు ఇటీవలే బయటపెట్టారు. ఏదేమైనా రాజధానిలో భూములకు రక్షణ లేకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications