మే 23 జడ్జిమెంట్ డే: సమగ్ర సమాచారం, లోతైన ఎన్నికల విశ్లేషణల కోసం వన్ ఇండియా- తెలుగు!
హైదరాబాద్: దేశ ప్రజలు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న జడ్జిమెంట్ డే వచ్చేసింది. మరి కొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. నేతల జాతకాలు ఏమిటనేది తేలబోతోంది. ఈ నెల 19వ తేదీన తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత..ఇక అందరి దృష్టీ 23వ తేదీన వెలువడే ఫలితాలపై నిలిచింది.
ఓట్ల లెక్కింపు కోసం యావత్ దేశం ఆసక్తితో ఎదురు చూస్తోంది. 19వ తేదీన సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడిన అనంతరం దేశ ప్రజల్లో నెలకొన్న ఆసక్తి కాస్తా ఉత్కంఠత మరింత పెరిగింది. ఓట్ల లెక్కింపు గడువు సమీసించే నాటికి అది పదింతలైంది.
ఎన్నికల ఫలితాలు కేవలం అంకెలతో మాత్రమే ముడిపడి ఉన్నవే కావు. దేశ ప్రజల ఆశలు, ఆశయాలు, వారి దైనందిన జీవితాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం ఈ ఎన్నికల ఫలితాలు. దేశ ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా వన్ ఇండియా - తెలుగు ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వాడి, వేడిగా, సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా అందజేయబోతోంది.
వన్ ఇండియా- తెలుగు ప్రత్యేకత ఏంటీ?
దేశం నలుమూలల నుంచీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని మెరుపువేగంతో, ఆకర్షణీయంగా గందరగోళానికి అవకాశం లేకుండా ప్రజల ముందుకు తీసుకుని రాబోతోంది వన్ ఇండియా - తెలుగు. 2014 నాటి ఎన్నికల ఫలితాలు, అప్పట్లో ఆయా పార్టీలు, అభ్యర్థులు సాధించిన ఆధిక్యతను సరిపోల్చుకుంటూ విశ్లేషణాత్మక కథనాలను ప్రజల ముందు ఉంచబోతోంది.
లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, రాష్ట్రాల వారీగా లోతైన విశ్లేషణలతో కూడిన సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయనుంది. లోక్సభ ఎన్నికలు, మన రాష్ట్రంతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తమిళనాడులోని ఉప ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకుని రాబోతున్నది.
దేశం మొత్తానికి చిరపరిచితులైన అభ్యర్థుల గెలుపోటములు, కీలక స్థానాలు, అక్కడ పోటీ చేసిన వారి మెజారిటీ.. వంటి సమాచారాన్ని వన్ ఇండియా - తెలుగు ద్వారా తెలుసుకోవచ్చు.
సామాజిక మాధ్యమాలు, ప్రత్యేకించి ట్విట్టర్ ట్రెండ్ల ద్వారా కూడా సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకుని రాబోతున్నది. ప్రముఖ పబ్లిషర్లకు చెందిన లైవ్ వీడియోలు, వైరల్ మెమె, ట్రెండింగ్ వీడియోలు.. ఇలాంటివన్నీ వన్ ఇండియా - తెలుగులోచూడవచ్చు.
ఓట్ల లెక్కింపు ఆరంభమైన వెంటనే- అన్ని కోణాల్లో విశ్లేషణాత్మక కథనాలు వన్ ఇండియా నుంచి వెలువడతాయి. అందర్నీ ఆకట్టుకునే ఫలితాల రాజకీయ నిష్ణాతుల తరహాలో విశ్లేషణలు రోజంతా కొనసాగుతాయి.