లక్ష్మీపార్వతికి ఝలక్: ఆ సినిమా ఆగదని కేతిరెడ్డి ప్రకటన
అన్న ఎన్టీఆర్పై చిత్రం తీయడానికి రామ్గోపాల్ వర్మ సిద్ధపడితే స్వాగతించిన లక్ష్మీపార్వతి, తాను సినిమా తీస్తానంటే ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తిరుపతి: లక్ష్మీస్ వీరగంధం సినిమా తీసి తీరుతానని లక్ష్మీస్ వీరగంథం సినిమా దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కచ్చితంగ చెబుతున్నారు. అన్న ఎన్టీఆర్పై చిత్రం తీయడానికి రామ్గోపాల్ వర్మ సిద్ధపడితే స్వాగతించిన లక్ష్మీపార్వతి, తాను సినిమా తీస్తానంటే ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
శనివారం ఉదయం తిరుమలేశుని దర్శించుకున్న ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తన చిత్రం లక్ష్మీస్ వీరగంథం సినిమా నిర్మాణానికి అడ్డంకులను సృష్టిస్తున్నారని అంటూ ఆమె ప్రవర్తనలో మార్పురావాలని స్వామివారిని కోరినట్లు చెప్పారు.
ఎన్టీఆర్ ఆత్మ ఆదేశం ప్రకారమే తాను చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా చిత్ర నిర్మాణం ఆగదన్నారు.
ఆమె నిజస్వరూపం..
అన్న ఎన్టీఆర్ గురించి తరచూ ఆమె మాట్లాడుతూ ప్రతిసారి కొడుకులకు ఆస్తులు, అల్లుళ్లకు అధికారం ఇచ్చారని, తనకేమీ ఇవ్వలేదని అంటున్నారని ఇక్కడే ఆమె నిజస్వరూపం ప్రజలకు తెలుస్తోందని కేతిరెడ్డి అన్నారు.
ఎన్టీఆర్ సతీమణిగా
ఎన్టీఆర్ సతీమణిగా ఆమె తనపై చేసిన దిగజారుడు వ్యాఖ్యలకు ప్రజల సమక్షంలోనే సమాధానం చెప్పాలని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే అన్నను అభిమానించే వారందరిని అవమానించినట్లేనని కేతిరెడ్డి తెలిపారు.
ఎన్టీఆర్ బయోపిక్...
బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మిస్తున్నారనే వార్తలు రావడంతో వివాదం మొదలైంది. అయితే, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకుడనే విషయాన్ని నారా లోకేష్ పరోక్షంగా తేల్చేశారు. దాంతో తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించి దుమారం రేపారు.
రామ్ గోపాల్ వర్మకు విరుగుడుగా....
రామ్ గోపాల్ వర్మ తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీస్తున్నట్లు ప్రకటించిన తర్వాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లక్ష్మీస్ వీరగంథం సినిమా తీస్తున్నట్లు చెప్పారు. దాంతో వివాదం మరో మలుపు తిరిగింది. దీనికి వ్యతిరేకంగా లక్ష్మీపార్వతి ధర్నా కూడా చేశారు. ఆ సినిమాను ఆమె వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తాజా ప్రకటన చేశారు.