విశాఖలో మరో ప్రమాదం: ఫార్మా కంపెనీలో భారీగా ఎగిసిన మంటలు, పలువురికి గాయాలు
విశాఖపట్నం: నగరంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడలోని జవహరలాల్ నెహ్రూ ఫార్మా సిటీలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ ఎస్ఈటీపీ సాల్వెంట్స్ బిల్డింగ్లో పేలుళ్ల కారణంగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు, సంస్థ సిబ్బంది భయంతో దూరంగా పరుగులు తీశారు.
Recommended Video
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే తాజా ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా అలజడి నెలకొంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైరింజిన్లతో మంటలను అర్పేందుకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
పలుమార్లు పేలుళ్లు సంభవిస్తుండటంతో అగ్ని మాపక సిబ్బంది సమీపంలోకి వెళ్లలేకపోతున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది కొంత దూరం నుంచే మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశాయి. తీవ్రంగా శ్రమించి మంటలను అర్పివేశాయి. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Andhra Pradesh: A fire has broken out at a pharma company in JN pharma city, Visakhapatnam. Fire tenders at the spot. No casualties reported. pic.twitter.com/Q9LvTbh6uJ
— ANI (@ANI) July 13, 2020
భారీగా మంటలు వెలువడటంతో సమీపంలోని ఇతర కంపెనీలకు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు, ఇతర సంస్థల సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంత దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అయితే, పేలుళ్ల కారణంగా పలువురు గాయాలపాలైనట్లు తెలిసింది. భారీ ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది.