జెపి లోకసత్తా బోణీ: తెలంగాణలో ఎంపిటిసి గెలుపు
హైదరాబాద్: సీమాంధ్ర పార్టీగా ముద్ర పడిన జయప్రకాష్ నారాయణ లోకసత్తా పార్టీ తెలంగాణలో ఓ ఎంపిటిసీ సీటు గెలుచుకుంది. ఆ రకంగా ఆ పార్టీ బోణీ కొట్టింది. తెలంగాణవాదం బలంగా ఉన్న నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం కరడ్పల్లి ఎంపీటీసీ స్థానంలో లోక్సత్తా అభ్యర్థి బాలచంద్రన్ 40 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.
ఈ విషయాన్ని లోకసత్తా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బండారు రామ్మో హన్రావు తెలిపారు. మునిసిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ పదవులకు పలు చోట్ల పోటీ చేసినాఎక్కడా విజయం సాధించలేదు.
ఇక మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.జయప్రకాశ్ నారాయణ్ (జెపి) పోటీ చేయగా, పలు అసెంబ్లీ స్థానాలకు లోక్సత్తా పోటీ చేసింది. సార్వత్రిక ఫలితాలు ఈ నెల 16న వెలువడనున్నా యి.
మల్కాజిగిరి నుంచి విజయం సాధించి, కేంద్రంలో మంత్రి పదవి చేపట్టాలనే ఉద్దేశంతో జెపి ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని అంటున్నారు. మల్కాజిగిరిలో తనకు మద్దతు ఇవ్వకపోయినా ఆయన బిజెపితోనే ఉన్నారు.