నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెపి లోకసత్తా బోణీ: తెలంగాణలో ఎంపిటిసి గెలుపు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీమాంధ్ర పార్టీగా ముద్ర పడిన జయప్రకాష్ నారాయణ లోకసత్తా పార్టీ తెలంగాణలో ఓ ఎంపిటిసీ సీటు గెలుచుకుంది. ఆ రకంగా ఆ పార్టీ బోణీ కొట్టింది. తెలంగాణవాదం బలంగా ఉన్న నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం కరడ్‌పల్లి ఎంపీటీసీ స్థానంలో లోక్‌సత్తా అభ్యర్థి బాలచంద్రన్ 40 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

ఈ విషయాన్ని లోకసత్తా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బండారు రామ్మో హన్‌రావు తెలిపారు. మునిసిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ పదవులకు పలు చోట్ల పోటీ చేసినాఎక్కడా విజయం సాధించలేదు.

LOk Satta wins MPTC in Telangana

ఇక మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.జయప్రకాశ్ నారాయణ్ (జెపి) పోటీ చేయగా, పలు అసెంబ్లీ స్థానాలకు లోక్‌సత్తా పోటీ చేసింది. సార్వత్రిక ఫలితాలు ఈ నెల 16న వెలువడనున్నా యి.

మల్కాజిగిరి నుంచి విజయం సాధించి, కేంద్రంలో మంత్రి పదవి చేపట్టాలనే ఉద్దేశంతో జెపి ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని అంటున్నారు. మల్కాజిగిరిలో తనకు మద్దతు ఇవ్వకపోయినా ఆయన బిజెపితోనే ఉన్నారు.

English summary
Jayaprakash narayana's Lok Satta has won one MPTC in Nizamabad district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X