వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ నా సోదరుడితో సమానం .. అనవసరపు పుకార్లు వద్దంటున్న సాధినేని యామిని

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని లోకేష్ తో క్లోజ్ గా ఉంటారని వచ్చిన ఆరోపణలపై స్పందించారు. కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె అన్నారు. లోకేష్ సోదర సమానుడని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, వైఎస్ జగన్ సోదరి షర్మిల, బ్రాహ్మణితో పాటు తన గురించి కూడా సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారనీ, విమర్శలు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని తెలిపారు. ఇలాంటి విమర్శలు చేసేవారికి సమాధానం ఇచ్చి తన విజ్ఞతను తగ్గించుకోనని స్పష్టం చేశారు.

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ .. పని గంటలు తగ్గిస్తూ నిర్ణయం ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ .. పని గంటలు తగ్గిస్తూ నిర్ణయం

 నా కుటుంబమే నాకు ముఖ్యం .. అనవసరపు ఆరోపణలు, పుకార్లు పట్టించుకోను

నా కుటుంబమే నాకు ముఖ్యం .. అనవసరపు ఆరోపణలు, పుకార్లు పట్టించుకోను

ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాధినేని యామిని పలు అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘టీడీపీలోకి యామిని వచ్చాక నారా లోకేశ్-బ్రాహ్మణి దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. సాధినేని యామిని లోకేశ్ బాబుతో చాలా క్లోజ్ గా ఉన్నారు' అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై ఆమె సోషల్ మీడియాలో పనీపాటా లేనివాళ్లే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు .నాకు ప్రేమగా చూసే భర్త , ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాకు పిల్లల భవిష్యత్, పిల్లల బాధ్యత, వ్యాపారంతో పాటు కుటుంబాన్ని కూడా పట్టించుకోవాలి. నేను వీటిలో తలమునకలు అయ్యాను కాబట్టి ఈ ఆరోపణలను పట్టించుకోను.నా కుటుంబ బాధ్యతలే నాకు సరిపోతాయని ఆమె పేర్కొన్నారు.

రాజకీయాల్లో బురద చల్లటం కామన్ .. అందుకే నేను వారి విజ్ఞతకే వదిలేస్తా అన్న యామిని

రాజకీయాల్లో బురద చల్లటం కామన్ .. అందుకే నేను వారి విజ్ఞతకే వదిలేస్తా అన్న యామిని

రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మంచి ఉంటుంది. చెడు కూడా ఉంటుంది. మెచ్చుకునేవారు ఉంటారు. ఇలా బురద చల్లేవారూ ఉంటారు. అన్నింటిని తెలుసుకుంటున్నాను అని ఆమె అన్నారు. నా గురించి ఏం తెలుసని వీళ్లు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు? అవతల లేడీ కాబట్టి ఆమెపై బురద చల్లేసి ఆమె వ్యక్తిత్వాన్ని చంపేస్తే ఆనందం వస్తుందని భావించే నెటిజన్లను నేను పట్టించుకోను. ఎందుకంటే వాళ్ల ఇళ్లలో కూడా ఆడవాళ్లు ఉంటారు అని ఆమె తన స్పందన తెలియజేశారు.

 లోకేష్ సోదర సమానుడు ..సోషల్ మీడియా లో పని లేనోళ్ళు చేసే కామెంట్స్ పట్టించుకోను

లోకేష్ సోదర సమానుడు ..సోషల్ మీడియా లో పని లేనోళ్ళు చేసే కామెంట్స్ పట్టించుకోను

చంద్రబాబు ఇంటిలోపలకు యామిని బెంజ్ కారు వెళుతుందన్న విషయం నిజం కాదు అన్నారు . నా కారు ఇప్పటివరకూ ప్రజావేదిక లోపలకు వెళ్లలేదు. ఇక లోకేష్ అంటారా.. నా సోదరుడితో సమానం. మంచి కుటుంబం, ప్రేమించే భర్త, ఎదిగివచ్చిన పిల్లలు ఉన్నప్పుడు ఎవ్వరూ అలాంటి పనులు చేయరు. నాపై వస్తున్న విమర్శలను చేస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నా' అని సాధినేని యామిని స్పష్టం చేశారు.

English summary
TDP official spokesperson Sadineni Yamini said Nara Lokesh is like brother to her and the rumours spreading about her in social media are completely baseless and she has no time to react on such filthy reports but urged people not to spread rumours."I'm blessed with three girls. Their future, my family, business and my political work keep me occupied. So I don't give much importance to social media reports," said Yamini in an interview to a YouTube channel. She added that not just on her, the social media trollers target Priyanka Gandhi, YS Sharmila, Nara Brahmani which is quite insulting. But we as woman have to maintain our dignity and ignore such negative propaganda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X