లోకసభ ఎన్నికలు 2019 : నర్సాపురం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video
సైలెంట్ రాజకీయాలు..క్షత్రియ వర్గానికి పెట్టని కోట నర్సాపురం నియోజకవర్గం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ నియో జకవర్గం పూర్తగా రాజుల అధిపత్యంలోనే ఉంటుంది. ఎందరో కీలక నేతలు ఇక్కడి నుండే లోక్సభ కు ఎన్నికయ్యారు. భూపతి రాజు విజయకుమార్ రాజు, బిజెపి ప్రముఖుడు కృష్ణం రాజు, టిటిడి మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు వంటి వారు ఇక్కడి నుండే లోక్సభ కు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుండి 1991 లో టిడిపి నుండి గెలిచిన భూపతి రాజు విజయ కుమార్ రాజు నాడు పివి నరసింహారావుకు మద్దతుగా పార్టీ చీలికకు నాయకత్వం వహించారు. మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు..2014 లో బిజెపి నుండి గెలిచిన గోకరాజు గంగరాజు ఇద్దరూ బావ -బావమరుదులు. ఈ నియోకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోకవర్గాల్లో 2014 లో ఒక్క నియోజకవర్గం మినహా అన్ని సెగ్మెంట్లలో ఒకే తీరున పోలింగ్ కనిపిస్తుంది.
17
సార్లు
ఎన్నికలు..
నరసాపురం
లోక్సభ
నియోజకవర్గం
1957
లో
ఏర్పాటైంది.
అప్పటి
నుండి
ఇప్పటి
వరకు
ఇక్కడ
17
సార్లు
లోక్సభ
కు
ఎన్నికలు
జరిగాయి.
ఇక్కడ
కాంగ్రెస్
ఎనిమిది
సార్లు
గెలవగా..
టిడిపి
నాలుగు
సార్లు
గెలిచింది.
బిజెపి
రెండు
సార్లు
ఇక్కడి
నుండి
గెలుపొందింది.
ఎనిమిది
మంది
క్షత్రిక
సామాజిక
వర్గ
నేతలు
15
సార్లు
ఇదే
లోక్సభ
నియోజకవర్గం
నుండి
ప్రాతినిధ్యం
వహించారు.
ఇద్దరు
కాపు
నేతలు
రెండు
సార్లు
గెలిచారు.
కాగా,
ఇక్కడి
నుండి
గెలిచిన
వారిలో
కృష్ణంరాజు
కేంద్ర
మంత్రిగా
పని
చేసారు.
ప్రస్తుతం
ఆయన
బిజెపిలో
ఉన్నా..క్రియాశీలక
రాజకీయాలకు
దూరంగా
ఉంటున్నారు.
2014
లో
బిజెపి
గెలుపు..
82
శాతం
పోలింగ్..
2014
ఎన్నికల్లో
ఈ
లోక్సభ
నియోజకవర్గంలో
మొత్తంగా
1325143
ఓటర్లు
ఉండగా,
అందులో
పురుష
ఓటర్లు
652668
మంది
ఉన్నారు.
కాగా,
మహిళా
ఓటర్లు
672475
మంది
ఉన్నారు.
2014
ఎన్నికల్లో
మొత్తం
ఇక్కడ
1088951
మంది
ఓటు
హక్కు
వినియోగించుకోగా..
అందులో
పురుష
ఓటర్లు
539357
మంది,
549594
మంది
మహిళా
ఓటర్లు
ఓటు
హక్కు
విని
యోగించుకున్న
వారిలో
ఉన్నారు.
కాగా..మొత్తంగా
82
శాతం
పోలింగ్
నమోదైంది.
ఇక్కడ
నుండి
2014
లో
టిడిపి
-బిజెపి
పొత్తులో
భాగంగా..బిజెపి
నుండి
గోకరాజు
గంగారాజు
పోటీ
చేసారు.
ఆయన
వైసిపి
అభ్యర్ధి
వంకా
రవీంద్ర
నాద్
పై
గెలుపొందారు.
గోకరాజు
గంగరాజుకు
540306
ఓట్లు
రాగా,
వైసిపి
అభ్యర్ధి
రవీంద్ర
నాధ్
కు
454955
ఓట్లు
వచ్చాయి.
దీంతో..
85351
ఓట్ల
మెజార్టీతో
గోకరాజు
గంగరాజు
గెలుపొందారు.
అధికార
పార్టీ
ఎంపీగా..
వివాద
రహితుడిగా
పేరున్న
గోకరాజు
గంగరాజు
బిజెపి
పెద్దల
తో
సన్నిహిత
సంబంధాలు
ఉన్న
నేత.
ఆయన
లోక్సభ
కు
ఎన్నికైన
తరువాత
అధికార
పార్టీ
సభ్యుడిగా
ఏపిలో
పార్టీ
వాయిస్
వినిపించటానికి
ప్రాధాన్యత
ఇచ్చారు.
లోక్సభ
లో
సభ్యుడిగా
ఆయన
కేవలం
రెండు
చర్చల్లో
మాత్రమే
పాల్గొన్నారు.
ఒక్క
బిల్లును
కూడా
ఆయన
ప్రతిపాదించే
అవకా
శం
రాలేదు.
సభలో
మాత్రం
224
ప్రశ్నలను
సంధించారు.
సభకు
హాజరు
82
శాతంగా
నమోదైంది.
విశాఖ,
నరసాపురం
రెండు
లోక్సభ
స్థానాల
నుండి
బిజెపి
2014
లో
గెలిచింది.
దీంతో..ఈ
ఇద్దరు
సభ్యులకు
మారుతున్న
రాజకీయ
పరిణా
మాల్లో
బాధ్యతలు
పెరిగాయి.
తిరిగి
పోటీలో
వారేనా..
2014
లో
టిడిపి
-
బిజెపి
పొత్తు
కారణంగా
గోకరాజు
గంగరాజు
కు
టిడిపి
తో
పాటుగా
పవన్
కళ్యాన్
మద్దతు
లభించింది.
మోదీ
హవా
కూడా
కలిసి
రావటంతో
గంగరాజు
భారీ
మెజార్టీతో
గెలుపొందారు.
సిట్టింగ్
ఎంపీగా
తిరిగి
బిజెపి
నుండి
గోక
రాజు
గంగరాజు
తిరిగి
పోటే
చేసే
అవకాశం
ఉంది.
ఇదే
సమయంలో
టిడిపి
నుండి
రఘురామ
రాజు
టిక్కెట్
ను
ఆశి
స్తున్నారు.
ఇక,
వైసిపి
నుండి
గతంలో
పోటీ
చేసిన
వ్యక్తికే
తిరిగి
అవకాశం
ఇచ్చే
పరిస్థితి
కనిపిస్తోంది.
జనసేన
ఈ
సారి
ఈ
నియోజకవర్గంలో
కీలక
పాత్ర
పోషించనుంది.
దీంతో..ఈ
సారి
ఈ
నియోజకవర్గంలో
చతుర్ముఖ
పోటీ
తప్పేలా
లేదు.
అభ్యర్ధులెవరనేది
ఖరారైతే..పోటీ
పై
మరింత
స్పష్టత
వచ్చే
అవకాశం
ఉంది.