వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి చేసుకున్నారు.. కానీ! ఆ ధైర్యం లేక రైలు కింద పడి ఆత్మహత్య..

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయితే చేసుకోగలిగారు కానీ పెద్దలు ఏమంటారోనన్న భయం వారిని ఆత్మహత్యకు పురిగొల్పింది.

|
Google Oneindia TeluguNews

చీరాల: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయితే చేసుకోగలిగారు కానీ పెద్దలు ఏమంటారోనన్న భయం వారిని ఆత్మహత్యకు పురిగొల్పింది.

వివరాల్లోకి వెళ్తే.. తిమ్మసముద్రానికి చెందిన బత్తుల సాయిసందీప్ (24),గుంటూరు జిల్లా మోదుకూరుకు చెందిన భోగిరెడ్డి మోనిక (23) చీరాలలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో వీరు బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు.

lovers commit suicide on prakasam district vetapalem railway track

కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు పెళ్లితో దగ్గరవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే మంగళవారం విజయవాడలో వివాహం చేసుకున్నారు. అయితే ఇంటికి వెళ్లే ధైర్యం లేక వేటపాలెం రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

చదువుతో పాటు తమతోను ఎప్పుడూ హుషారుగా ఉండే సందీప్, మౌనిక ఆత్మహత్య చేసుకోవడం తోటి స్నేహితులను విషాదంలో ముంచెత్తింది. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

English summary
Lovers committed suicide by throwing themselves before a train on Tuesday at Vetapalem
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X