నోట్లకు చెల్లుబాటు గడువు, రూ.2వేల బదులు 200: గల్లా జయదేవ్ కీలక సూచనలు
పెద్ద నోట్ల అంశంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటుసభ్యుడు గల్లా జయదేవ్ లోకసభలో పలు కీలక సూచనలు చేశారు. కరెన్సీ నోట్లకు చెల్లుబాటు గడువు(ఎక్స్పైరీ డేట్) పెట్టాలని, దీనివల్ల అక్రమంగా దాచుకోవడం .
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల అంశంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటుసభ్యుడు గల్లా జయదేవ్ లోకసభలో పలు కీలక సూచనలు చేశారు. కరెన్సీ నోట్లకు చెల్లుబాటు గడువు(ఎక్స్పైరీ డేట్) పెట్టాలని, దీనివల్ల అక్రమంగా దాచుకోవడం తగ్గుతుందని గుంటూరు ఎంపీ జయదేవ్ పేర్కొన్నారు.
గురువారం లోక్సభలో చర్చ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న రూ.2వేల నోటును రద్దుచేసి ఆ స్థానంలో రూ.200 నోటు తీసుకురావాలని కోరారు. మిర్చి రైతుల్ని ఆదుకోవాలని జయదేవ్ లోక్సభలో డిమాండ్ చేశారు.
Speaking in parliament today suggested having expiry dates for big currency notes to avoid hoarding and have... https://t.co/rGwd2Z0TLG
— Jay Galla (@jaygalla) March 30, 2017
గత సంవత్సరం మిర్చి క్వింటాలు రూ.15వేల వరకు ఉండగా ఈ ఏడాది రూ.8వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రూ.12వేల మద్దతుధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని గల్లా జయదేవ్ కోరారు.