సీమాంధ్ర నేతల కన్నీళ్లు నమ్మొద్దు: ఎంపి మధుయాష్కీ
సిఎం తీర్మానానికి విలువ లేదు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు పైన తీర్మానానికి ఎలాంటి విలువ లేదని నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లాలనే ఆలోచన దింపుటు కళ్లెం వంటిదన్నారు. తమ ప్రాంతానికి ఏం సాధించుకోవాలని ఆలోచించకపోవడం సిగ్గుచేటు అన్నారు.
కిరణ్, చంద్రబాబులులు కుమ్మక్కై తీర్మానం నాటకం ఆడారని మండిపడ్డారు. సీమాంధ్ర నేతలు తమ ప్రాంతానికి ఏం కావాలో ఆలోచించాలని సూచించారు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగే సవరణలకు తాము సహకరిస్తామని చెప్పారు. కిరణ్ ముఖ్యమంత్రి పదవికి అప్రతిష్ట తెచ్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ ఆపుతామనే ప్రగల్భాలు మానుకోవాలని హితవు పలికారు.
టి ఓడిపోలేదు
తెలంగాణ ముసాయిదా బిల్లు ఓడిపోలేదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. కిరణ్ నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ నిర్ణయాన్ని తప్పు పట్టే స్థాయి కిరణ్కు లేదన్నారు. సాధారణ ఎన్నికల కంటే ముందే తెలంగాణ వస్తుందని చెప్పారు. సోమవారం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు.